Manish Sisodia: మనీష్ సిసోడియాకు ప్రమోషన్.. పంజాబ్ ఇన్ఛార్జ్గా నియామకం
- మనీష్ సిసోడియాకు ప్రమోషన్
- పంజాబ్ ఇన్ఛార్జ్గా నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనీషి సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఆప్ విభాగానికి సౌరబ్ భరద్వాజ్, పంజాబ్ ఇన్ఛార్జ్గా మనీషి సిసోడియాను నియమించారు. సౌరబ్ భరద్వాజ్.. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మె్ల్యేగా గెలిచారు. అలాగే రెండు సంవత్సరాలు ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా సౌరభ్ భరద్వాజ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
Also Read
ఇది కూడా చదవండి: Kriti Sanon : ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు..
మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహారాజ్ మాలిక్ను నియమించింది. సీనియర్ నాయకులు గోపాల్ రాయ్, దుర్గేష్ పాఠక్లను వరుసగా గుజరాత్ ఇన్చార్జ్ మరియు సహ ఇన్చార్జ్లుగా నియమించారు. పంకజ్ గుప్తాను గోవా ఆప్ ఇన్చార్జ్గా నియమించింది. మనీష్ సిసోడియాను పంజాబ్ ఇన్చార్జ్గా, సతేంద్ర జైన్ను కో-ఇన్చార్జ్గా నియమించారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను మాత్రం రాష్ట్ర కో-ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం పంజాబ్లోనే ఆప్ అధికారంలో ఉంది. ఇక పంజాబ్కు చెందిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్చార్జ్గా నియమించారు.
ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అతిషికి ప్రతిపక్ష హోదా దక్కింది.
ఇది కూడా చదవండి: Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సంచలనన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..