Madhyapradesh: పనికి వెళ్లమన్నందుకు భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు 30 ఏళ్ల విభోర్ సాహు భార్య రీతు(23)ను కత్తెరలో పొడిచి చంపాడు. అనంతరం సాహు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం జబల్ పూర్ లోని సాహు ఇంటిలో చూడగా విబోర్ సాహు మృతి చెందగా, అతని భార్య రీతు రక్తపు మడుగులో పడి ఉన్నారని రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ సహదేవ్ రామ్ సాహు తెలిపారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉండే తల్లి, సోదరుడు బయటకు వెళ్లారని.. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇద్దరు చనిపోయి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ గా ఉన్న విభోర్ సాహు గత 15 రోజులుగా విధులకు వెళ్లడం లేదు. దీంతో భార్య తమ జీవనోపాధి దెబ్బతింటుందని..పదేపదే చెప్పినందుకు సాహు ఈ హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత భార్య రీతూను కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి.. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!