Madhyapradesh: పనికి వెళ్లమన్నందుకు భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు 30 ఏళ్ల విభోర్ సాహు భార్య రీతు(23)ను కత్తెరలో పొడిచి చంపాడు. అనంతరం సాహు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం జబల్ పూర్ లోని సాహు ఇంటిలో చూడగా విబోర్ సాహు మృతి చెందగా, అతని భార్య రీతు రక్తపు మడుగులో పడి ఉన్నారని రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ సహదేవ్ రామ్ సాహు తెలిపారు.
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉండే తల్లి, సోదరుడు బయటకు వెళ్లారని.. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇద్దరు చనిపోయి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ గా ఉన్న విభోర్ సాహు గత 15 రోజులుగా విధులకు వెళ్లడం లేదు. దీంతో భార్య తమ జీవనోపాధి దెబ్బతింటుందని..పదేపదే చెప్పినందుకు సాహు ఈ హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత భార్య రీతూను కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి.. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..