Mamat Banerjee: ఐ-ప్యాక్పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’
- సంచలనంగా ఈడీ కోల్కతా దాడులు..
- ఐ-ప్యాక్ దాడితో, మమతా బెనర్జీ పరుగులు..
- బ్యాక్ డోర్ గుండా ఐ ప్యాక్ ఆఫీస్లోకి ఎంట్రీ..
- కీలకంగా మారిన గ్రీన్ ఫైల్..
- మమత తీసుకెళ్లిన ఫైళ్లలో ఏముంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamat Banerjee: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు చేసింది. ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం, సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఆఫీస్లో సోదాలు జరిగాయి.
Read Also: Bangladesh: దీపు చంద్ర దాస్ హత్యలో కీలక నిందితుడి అరెస్ట్.. మసీదు బోధకుడే సూత్రధారి..
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
ఐ-ప్యాక్తో టీఎంసీ మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఐ ప్యాక్ పనిచేసింది. ఈడీ దాడుల సమయంలో కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన జైన్ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడికి సీఎం మమతా బెనర్జీ చేరుకోవడం సంచలనంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత, ఆమె చేతిలో గ్రీన్ ఫైల్ ఉండటం, కంగారుగా కనిపించడం వైరల్ అయింది. ఈ దాడుల గురించి మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపితమని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇది జరిగిందని ఆరోపించారు. తృణమూల్ ఎన్నికల వ్యూహాలను, 2026 ఎన్నికల అభ్యర్థల జాబితాను, పార్టీ రహస్య పత్రాలను పొందేందుకే ఈ దాడులు చేసినట్లు ఆమె ఆరోపించింది. ఎన్నికల వ్యూహాల ఫైళ్లను దొంగలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు.
జైన్ నివానం నుంచి, నేరుగా సాల్ట్ లేక్ ప్రాంతంలోని దాని కార్యాలయం వద్దకు చేరుకున్న మమతా బెనర్జీ, వెనక ద్వారం నుంచి ఆఫీసులోకి వెళ్లారు. 15-20 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చారు. ఆమెతో సీఎంఓ అధికారులు అనేక ఫైళ్లను పట్టుకెళ్లడం కనిపించింది. మమత వచ్చిన కారు వెనకలో ఈ ఫైళ్లను ఉంచారు. అయితే, ఈ సోదాలు మనీలాండరింగ్కు సంబంధించినవి అని ఈడీ చెబుతోంది. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ, ఆమె సిబ్బంది రాష్ట్ర పోలీసులు ఫిజికల్ పేపర్స్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారని ఈడీ పేర్కొంది. ఇప్పుడు మమత తీసుకెళ్లిన ఫైళ్లలో ఏమందనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఫైల్పై ‘‘ఫిబ్రవరి 2022’’గా ఉంది, మరో ఫైల్లో టీఎంసీ నాయకుల ప్రయాణ వివరాలు ఉన్నాయి. మరో పేపర్లో ‘‘మహువా మోయిత్రా x 1’’ అని ఉంది.
🚨 ED की छापेमारी में I-PAC कार्यालय और उसके प्रमुख प्रतीक जैन का आवास जांच के दायरे में आया।
जांच के दौरान मुख्यमंत्री ममता बनर्जी का स्वयं मौके पर पहुंचकर पार्टी के दस्तावेज़ और हार्ड डिस्क समेटना बेहद गंभीर सवाल खड़े करता है।
अगर पश्चिम बंगाल में कुछ भी गलत नहीं हो रहा , तो एक… pic.twitter.com/ZVDjamEhhZ— संस्कृति (@HinduHeritage__) January 8, 2026
తాజావార్తలు
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
Venkey : AK 47 అక్టోబరు 2 రిలీజ్ కష్టమే?
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!