Mamata Banerjee: బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను కలుగచేశాయి. ఢిల్లీ నుంచి మొదలుకుని ఉత్తర్ ప్రదేశ్, రాంచీ, హైదరాబాద్, హౌరా ఇలా పలు ప్రాంతాల్లో ముస్లింల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్ రాంచీలో అల్లర్లలో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో నిరసన పేరుతో అల్లర్లకు పాల్పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసులను దగ్ధం చేశాయి అల్లరిమూకలు.
ఇదిలా ఉంటే అల్లర్లపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌరాలో హింసకు బీజేపీనే కారణం అని నిందించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న హింస వేనక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. వారు అల్లర్లు చేయాలనుకుంటున్నారు.. కానీ వాటిని సహించను, అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ట్వీట్ చేశారు.
Also Read
శుక్రవారం మొదలైన అల్లర్లు శనివారం కూడా కొనసాగాయి. శనివారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలను జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. జూన్ 15 వరకు 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాలు. బెంగాల్ను సురక్షితంగా ఉంచడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.
రోడ్లను, రైల్వే లైన్లను దిగ్భందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. సామాన్యులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆందోళనకారులను సీఎం మమతా బెనర్జీ కోరారు. మీరు నిరసన తెలపాలంటే ఢిల్లీ లేదా గుజరాత్, యూపీ వెళ్లి నిరసనలు తెలపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రుణమూల్ గుండాలు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులను కొడుతున్నారని బీజేపీ పార్టీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!