Mamata Banerjee: బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలి..?
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను కలుగచేశాయి. ఢిల్లీ నుంచి మొదలుకుని ఉత్తర్ ప్రదేశ్, రాంచీ, హైదరాబాద్, హౌరా ఇలా పలు ప్రాంతాల్లో ముస్లింల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్ రాంచీలో అల్లర్లలో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో నిరసన పేరుతో అల్లర్లకు పాల్పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసులను దగ్ధం చేశాయి అల్లరిమూకలు.
ఇదిలా ఉంటే అల్లర్లపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌరాలో హింసకు బీజేపీనే కారణం అని నిందించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న హింస వేనక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. వారు అల్లర్లు చేయాలనుకుంటున్నారు.. కానీ వాటిని సహించను, అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ట్వీట్ చేశారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
శుక్రవారం మొదలైన అల్లర్లు శనివారం కూడా కొనసాగాయి. శనివారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలను జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. జూన్ 15 వరకు 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాలు. బెంగాల్ను సురక్షితంగా ఉంచడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.
రోడ్లను, రైల్వే లైన్లను దిగ్భందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. సామాన్యులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆందోళనకారులను సీఎం మమతా బెనర్జీ కోరారు. మీరు నిరసన తెలపాలంటే ఢిల్లీ లేదా గుజరాత్, యూపీ వెళ్లి నిరసనలు తెలపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రుణమూల్ గుండాలు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులను కొడుతున్నారని బీజేపీ పార్టీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!