Maldives: చైనాలో మాల్దీవుల ఒప్పందం.. భారత అధికారులు వెళ్లిపోవాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మరోసారి భారత్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది, పౌర దుస్తుల్లో ఉన్న వారు కూడా తమ దేశంలో ఉండరాదని హెచ్చరించారు. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బందిని , పౌర సిబ్బంది మాల్దీవులకు చేరుకున్న వారంలోపే ముయిజ్జూ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత సైనిక సిబ్బంది మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 10 లోగా ఈ ప్రక్రియ మొదటిదశ ప్రారంభించనున్నారు. అయితే, తాజాగా ముయిజ్జూ ఈ తేదీ కన్నా ముందుగానే ప్రకటన చేయడం గమనార్హం.
Read Also: CM Revanth Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
భారతదేశ సైనికులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు తమ ప్రభుత్వం విజయం సాధించినందుకు, తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తులు పరిస్థితిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముయిజ్జై బా అటోల్ ఎయిదాఫుషి ప్రాంతంలోని ప్రజలను ఉద్దేశించి అన్నట్టుగా అక్కడి మీడియా నివేదించింది. మే 10వ తేదీన భారత సైనికులు ఉండరు, భారత సైన్యం ఈ దేశంలో ఏ దుస్తుల్లో కూడా నివసించదు, ఈ విషయాన్ని తాను విశ్వాసంతో చెబుతున్నానని, చైనాతో ఉచిత సైనిక సహాయ ఒప్పందంపై సంతరం చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నెల ప్రారంభంలో ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఇరు పక్షాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, మాల్దీవుల్లో మూడు విమాన ప్లాట్ఫారమ్లను నిర్వహిస్తున్న తమ సైనిక సిబ్బందిని మే 10 నాటికి భారత్ భర్తీ చేస్తుందని, మొదటి దశ ప్రక్రియ మార్చి 10 నాటికి పూర్తి చేయాలని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి ప్రజలకు మానవతా సేవలను అందించేందుకు 88 మంది సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉన్నారు. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు దగ్గరవుతున్నాడు. భారత దేశానికి 300 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్కి ప్రమాదకరంగా భావిస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!