High Court: “కోడలు” చాపపై పడుకోవడం, టీవీ చూడకుండా నిషేధించడం క్రూరత్వం కాదు.
- కోడలుని చాపపై పడుకోమనడం.. టీవీని నిషేధించడం క్రూరత్వం కాదు..
- కుటుంబంపై 20 ఏళ్ల శిక్షని రద్దు చేసిన బాంబే హైకోర్టు..
High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు. అతనితో పాటు అతడి కుటుంబంపై 20 ఏళ్ల శిక్ష పడింది. అయితే ఐపీసీ 498A కింద నిందలువేయడం, పరిమితులు విధించడం తీవ్రమైన క్రూరత్వం కాదని కోర్టు తీర్పు చెబుతూ శిక్షని రద్దు చేసింది.
Read Also: Canada Student Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్కి షాక్.. SDS వీసా నిలిపివేత..
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
భార్యని అవహేళనర చేయడం, టీవీ చూడనివ్వకపోవడం, ఒంటరిగా ఆలయాన్ని సందర్శించకుండా చేయడం, చాపపై పడుకునేలా చేయడం వంటి ఆరోపణలు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A ప్రకారం “తీవ్రమైన” చర్యలు కాదని కోర్టు గుర్తించింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్లు 498A మరియు 306 కింద దిగువ కోర్టు మరణించి మహిళ భర్తని అతడి తల్లిదండ్రుల్ని, సోదరుడిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.
అక్టోబర్ 17న జస్టిస్ అభయ్ ఎస్ వాఘ్వాసే ఈ కేసును విచారించారు. మహిళ తయారు చేసిన భోజనం గురించి అవహేళన చేయడం, ఆమె టీవీని చూడటాన్ని పరిమితం చేయడం, పొరుగింటికి వెళ్లడాన్ని, ఒంటరిగా ఆలయానికి వెళ్లడాన్ని నిషేధించడం, ఆమె కార్పెట్పై పడుకునేలా చేయడం వంటివి ఆరోపణలుగా ఉన్నాయి. మరణించిన మహిళ కుటుంబం ఈ ఆరోపణల్ని చేసింది. ఇదే కాకుండా సదరు మహిళని అర్థరాత్రి నీటిని పట్టాలని వేధించాలని ఆరోపించింది. అయితే, కోర్టు విచారణలో మహిళ, ఆమె అత్తమామలు నివసించే ఏరియాలో తెల్లవారుజామున 1.30 గంటలకు నీటి సరఫరా జరుగుతుందని సాక్ష్యులు వెల్లడించారని కోర్టు గుర్తించింది.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!