Maharashtra: శ్రద్ధాను 35 ముక్కలుగా నరికాడు..నేను 70 ముక్కలుగా నరికేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra woman harassed by live-in partner: దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా శ్రద్ధ సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా 35 ముక్కలుగా చేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ ను పోలీసులు విచారించారు. పాలీగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా తనను విడిచి వేరేవాళ్లతో వెళ్లిపోతుందనే చంపేసి ముక్కలుగా చేశానని వెల్లడించాడు. శ్రద్ధాతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సమయంలోనే మరో 20 మంది హిందూ మహిళలతో సంబంధాలు నెరిపినట్లు వెల్లడించాడు.
ఇదిలా ఉంటే శ్రద్ధా మరణం తర్వాత మరో యువతికి ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి. మహారాష్ట్రకు ధులేకు చెందిన ఓ యువతి కొనేళ్లుగా అర్షద్ సలీం మాలిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే అతను వేధించడంతో విడిపోదాం అనుకున్న మహిళ బెదిరించాడు సలీం మాలిక్. శ్రద్ధాను 35 ముక్కలుగానే చేశాడు నిన్ను 70 ముక్కలుగా నరికేస్తా అంటూ బెదిరించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
Read Also: Football Player: గుండెపోటుతో కుప్పకూలి యువ ఆటగాడు కన్నుమూత
అత్యాచారం.. మతమార్పిడి:
అర్షద్ సలీం మాలిక్ తనను వేధిస్తున్నాడంటూ సదరు మహిళ ఆరోపించింది. నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుంచి యువతి సలీంమాలిక్ తో సహజీవనం చేస్తుంది. అయితే సదరు మహిళకు అంతకుముందే వివాహం అయింది. 2019తో భర్త చనిపోయాడు. 2017లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమెను సలీం మాలిక్ ను కలుసుకుంది. అయితే సలీం మాలిక్ తనను తాను హర్షద్ మాలి అనే మారు పేరుతో పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలో ధులేలోని లాలింగ్ గ్రామంలో అడవిలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. కాగా.. ఈ క్రమంలోనే హర్షల్ అసలు పేరు అర్షద్ సలీం మాలిక్ గా గుర్తించింది. అనంతరం ఆమెను ఉస్మానాబాద్ తీసుకెళ్లాడు సలీం మాలిక్. మాలిక్ తనని బలవంతంగా మతం మార్చాడాని.. తన బిడ్డ మతం మార్చడానికి ప్రయత్నించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలిక్ తండ్రి కూడా తనను దారుణంగా వేధించాడని వెల్లడించింది. ఈ క్రమంలోనే వీరికి ఈ ఏడాది ఆగస్టులో బిడ్డ జన్మించింది. ఆ సమయంలో కూడా సలీం మాలిక్ మహిళపై వేధింపులు కొనసాగించాడు. కొన్ని సార్లు సైలెన్సర్ లో శరీరాన్ని కాల్చే వాడని ఫిర్యాదు చేసింది. శ్రద్ధాను 35 ముక్కలుగా నరికేశాడు.. నేను 70 ముక్కలుగా నిన్ను నరికేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!