Maharashtra: హలోకు బదులు “వందేమాతరం”.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Instead Of Hello In New Campaign:మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఫోన్ కాల్స్ స్వీకరించేటప్పుడు ఇకపై హలోకు బదులుగా ‘వందేమాతరం’ చెప్పాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించింది. వందేమాతరం అంటే.. మా అమ్మకు ముందు నమస్కరిస్తున్నామని అర్థం అని.. అందుకే ప్రజల్ని హలోకు బదులు వందేమాతరం చెప్పాలని కోరుతున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అన్నారు. వార్థాలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందేమాతరం ప్రచారాన్ని ప్రారంభించారు.
Read Also: climbed Tirumala Steps with his wife: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
దీనిపై మహా సర్కార్ ప్రభుత్వ రిజల్యూషన్(జీఆర్)ను జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అధికారిక, వ్యక్తిగత ఫోన్ కాల్ స్వీకరించే సమయంలో హలోకు బదులు వందేమాతరం పలకాలని స్పష్టం చేసింది. అయితే ఇది తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని.. హెచ్ఓడీలు తమ ఉద్యోగులు ఇలా పలకరించేలా ప్రోత్సహించాలని కోరింది. హలో అనేది పాశ్చాత్య సంస్కృతి అని.. ఈ పదానికి నిర్ధిష్ట అర్థం లేదని.. ఈ పదం లాంఛనప్రాయమే అని ప్రభుత్వం చెబుతోంది. వందేమాతరం పలకడం వల్ల ఆప్యాయత భావాన్ని పెంపొందుతుందని.. దీనిపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అయింది మహారాష్ట్ర ప్రభుత్వం.
మంత్రి సుధీర్ మునిగంటివార్ మాట్లాడుతూ.. ప్రజలు ‘‘జై భీమ్’’, ‘‘జై శ్రీరాం’’ అని చెప్పాలనుకున్నా, ఫోన్ కాల్ కు సమాధానం ఇచ్చేటప్పుడు వారి తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించాలని అనుకున్నా అభ్యంతరం ఏం లేదని అన్నారు. కాల్స్ స్వీకరించేటప్పుడు హలో చెప్పకూడదన్నదే మా అభిమతం అని ఆయన అన్నారు. స్వాతంత్య్రోద్యమం కాలంలో ‘ ఇంక్విలాబ్ జిందాబాాద్’ అనే పదాన్ని బ్రిటీష్ వారు నిషేధించారని.. అయివతే అదే ఎంతో మంది ఉద్యమంలో పాల్గొనేలా చేసిందన్నారు. మహత్మా గాంధీ కూడా వందేమాతరాన్ని సమర్థించారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!