Maharashtra: హలోకు బదులు “వందేమాతరం”.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Instead Of Hello In New Campaign:మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఫోన్ కాల్స్ స్వీకరించేటప్పుడు ఇకపై హలోకు బదులుగా ‘వందేమాతరం’ చెప్పాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించింది. వందేమాతరం అంటే.. మా అమ్మకు ముందు నమస్కరిస్తున్నామని అర్థం అని.. అందుకే ప్రజల్ని హలోకు బదులు వందేమాతరం చెప్పాలని కోరుతున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అన్నారు. వార్థాలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందేమాతరం ప్రచారాన్ని ప్రారంభించారు.
Read Also: climbed Tirumala Steps with his wife: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
Also Read
- Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
- Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
దీనిపై మహా సర్కార్ ప్రభుత్వ రిజల్యూషన్(జీఆర్)ను జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అధికారిక, వ్యక్తిగత ఫోన్ కాల్ స్వీకరించే సమయంలో హలోకు బదులు వందేమాతరం పలకాలని స్పష్టం చేసింది. అయితే ఇది తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని.. హెచ్ఓడీలు తమ ఉద్యోగులు ఇలా పలకరించేలా ప్రోత్సహించాలని కోరింది. హలో అనేది పాశ్చాత్య సంస్కృతి అని.. ఈ పదానికి నిర్ధిష్ట అర్థం లేదని.. ఈ పదం లాంఛనప్రాయమే అని ప్రభుత్వం చెబుతోంది. వందేమాతరం పలకడం వల్ల ఆప్యాయత భావాన్ని పెంపొందుతుందని.. దీనిపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అయింది మహారాష్ట్ర ప్రభుత్వం.
మంత్రి సుధీర్ మునిగంటివార్ మాట్లాడుతూ.. ప్రజలు ‘‘జై భీమ్’’, ‘‘జై శ్రీరాం’’ అని చెప్పాలనుకున్నా, ఫోన్ కాల్ కు సమాధానం ఇచ్చేటప్పుడు వారి తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించాలని అనుకున్నా అభ్యంతరం ఏం లేదని అన్నారు. కాల్స్ స్వీకరించేటప్పుడు హలో చెప్పకూడదన్నదే మా అభిమతం అని ఆయన అన్నారు. స్వాతంత్య్రోద్యమం కాలంలో ‘ ఇంక్విలాబ్ జిందాబాాద్’ అనే పదాన్ని బ్రిటీష్ వారు నిషేధించారని.. అయివతే అదే ఎంతో మంది ఉద్యమంలో పాల్గొనేలా చేసిందన్నారు. మహత్మా గాంధీ కూడా వందేమాతరాన్ని సమర్థించారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
-
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం.. సిరీస్ కైవసం..
-
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
-
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!