Maharashtra: శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. సేఫ్టీ స్వ్కాడ్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra To Set Up Safety Squad For Eloped Girls: శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశారు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీ చుట్టుపక్కట పారేశాడు. ఈ కేసులో వివరాలు సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది.
Read Also: Bajrang Dal: శ్రద్ధావాకర్ హత్య “లవ్ జీహాద్”కు ఉదాహరణ.. అఫ్తాబ్ దిష్టిబొమ్మ దహనం
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
మహిళ రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహారాష్ట్రలోని స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా శనివారం తెలిపారు. తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి రక్షణ కోసం ఈ ప్రత్యేక స్వ్కాడ్ పనిచేయనుంది. ఇంటి నుంచి పారిపోతున్న అమ్మాయి కోసం ప్రత్యేక స్వ్కాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఒక అమ్మాయికు 18 ఏళ్లు దాటిన తర్వాత అమె కుటుంబం బలవంతం చేయకూడదని.. అయితే కుటుంబ సభ్యులతో గొడవ పడినప్పుడు, తల్లిదండ్రులను ఎదురిస్తూ వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు కుటుంబం నుంచి సహాయం లభించదని అన్నారు.
ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధా ఎముకలు, బ్లడ్ శాంపిళ్లను సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు. దీంతోపాటు శ్రద్ధను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మరో ఐదు రోజుల్లో అఫ్తాబ్ కు నార్కో టెస్టు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 15 రోజలు తర్వాత వచ్చే డీఎన్ఏ రిపోర్టు ఈ హత్యలో కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!