Maharashtra Elections: సీట్ షేరింగ్పై స్పీడ్ పెంచిన బీజేపీ కూటమి.. అమిత్ షాతో భేటీ..
- మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం..
- సీట్ షేరింగ్పై స్పీడ్ పెంచిన బీజేపీ కూటమి..
- అర్ధరాత్రి వరకు అమిత్ షాతో మహాయుతి నేతల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్పై బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ స్పీడ్ పెంచింది. సీట్ల షేరింగ్ విషయమైన గత రాత్రి కేంద్ర హోం మంత్రితో కూటమి నేతలు భేటీ అయ్యారు. చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అమిత్ షాని కలిశారు.
Read Also: Ananya Nagalla: అనన్య నాగళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే బీజేపీ 155 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 105 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగిలిన స్థానాల్లో ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మధ్య పంపకాలు జరగాల్సి ఉంది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి భావిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్-ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే, ఈ కూటమిలో శివసేన ఠాక్రే, కాంగ్రెస్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేపై, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బహిరంగంగానే విమర్వలు గుప్పించారు. శివసేన విదర్భ ప్రాంతంలో ఎక్కువ స్థానాల్ని కోరుతుంటే, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వచ్చిన ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లను కోరుకుంటున్నట్లు సమాచారం. ఎంవీఏ కూటమి మొత్తం 288 స్థానాల్లో 263 చోట్ల సీట్ల షేరింగ్ ఖరారైనట్లు వినికిడి. 25 స్థానాల్లో ప్రతిష్టంభన నెలకొని ఉంది. వీటిలో కుర్లా, ధారావి, వెర్సోవా, బైకుల్లా వంటి సహా ముంబైలోని 36 నియోజకవర్గా్ల్లో 5 ఉన్నాయి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!