Maharashtra Politics: వేడెక్కిన ‘మహా’ రాజకీయం.. షిండే శిబిరంలో 50 మంది!
మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. శివసేన రెబల్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శిందే క్యాంప్లో చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే అని షిండే మీడియాకు స్వయంగా వెల్లడించారు. తమపై నమ్మకం ఉన్నవారు తమతో చేతులు కలపొచ్చని.. తాము బాలాసాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఈ నేపథ్యంలో రెబల్స్పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. ఈ మేరకు ఏక్నాథ్ షిండే సహా 11 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు అందజేసింది. దీనిపై స్పందించిన షిండే.. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసింది చట్టవ్యతిరేకమని… వారికి ఆ హక్కు లేదన్నారు. తమకు మెజార్టీ ఉందన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా కీలకమన్నారు. వారికి సస్పెండ్ చేసే హక్కు కూడా లేదని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు.. ఏక్నాథ్ శిందేను తమ నాయకుడిగా పేర్కొంటూ గవర్నర్, డిప్యూటీ స్పీకర్కు లేఖలు రాశారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లడం గమనార్హం.
మరోవైపు బలప్రదర్శనకు కూడా షిండే వర్గం సిద్ధం అవుతోంది. తాము అవసరమైన సమయంలో పార్టీ ఛైర్మన్ (ఏక్నాథ్) చెప్పినప్పుడు గవర్నర్ ఎదుట లేదా స్పీకర్ వద్ద బలప్రదర్శనకు సిద్ధంగా ఉన్నట్లు ఏక్నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉంటే తమను ఒత్తిడికి గురి చేస్తారనే అస్సాంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జిల్లా అధ్యక్షులతో ఇవాళ సమావేశం కానున్నారు. ఇప్పటికే షిండే వర్గం 400 మంది కార్పొరేటర్లతో భేటీ అయిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్ధవ్ నుంచి చేజారవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ జిల్లా అధ్యక్షులతో భేటీ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?