Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు
- మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు..
- 7994 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు..
- అధికారంలోకి వచ్చేం దుకు యత్నిస్తున్న మహాయుతి- మహావికాస్ కూటములు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 921 మంది నామినేషన్ పేపర్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమై 29తో ముగిసింది. అక్టోబర్ 30వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన కూడా పూర్తైంది. అభ్యర్థిత్వాల ఉప సంహరణకు నవంబర్ 4వ తేదీ లాస్ట్.
Read Also: Karthika Masam 2024: కార్తీక మాసం విశేషాలు.. మొదలయ్యేది ఎప్పటి నుంచి అంటే..
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
కాగా, 288 మంది శాసన సభ్యులున్న మహారాష్ట్రలో నవంబరు 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్)లతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
Read Also: Fire Accident : దీపావళి రోజు ఢిల్లీలో 318చోట్ల మంటలు.. అనేక ఇళ్లు బూడిద
అయితే, మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో తొలి ఓటర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా.. 4.6 కోట్ల మంది ఉమెన్స్ ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక, శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగిపోయింది అని ఈసీ తెలిపింది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!