Bhagat Singh Koshyari: “మహారాష్ట్ర నుంచి ఒకవేళ గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే”.. గవర్నర్ సంచలన వ్యాఖ్యల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Governor Bhagat Singh Koshiyari controversy comments: గత కొంత కాలంగా మహారాష్ట్రలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బయటకు రావడంతో పాటు తనతో పాటు 40కిపైగా ఎమ్మెల్యేలు ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ షాక్ తగిలింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం అధికారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని ఒక్కక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి చేరారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టులో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడటంతో మహా రాజకీయ సంక్షోభం ముగిసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. శుక్రవారం ఓ కార్యక్రమంలోని ప్రసంగంలో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లిపోమంటే..ముఖ్యంగా ముంబై, థానే నగరాల్లో డబ్బు ఉండదని.. ముంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండలేదని ఆయన అన్నారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Mumabi: మ్యాగీ నూడల్స్ లో టొమాటోను కలిపి తిన్నందుకు మహిళ మృతి
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలతో పాటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం టార్గెట్ చేస్తోంది. గవర్నర్ కోష్యారీ కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలను అవమానపరుస్తున్నారంటూ.. ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ స్పాన్సర్డ్ గవర్నర్ మరాఠీ ప్రజలు అవమానించారని.. అయితే ఆత్మగౌరవంతో బయటకు వెళ్లిన శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎందుకు మౌనంగా ఉంటుందని.. సీఎం షిండే, కనీసం గవర్నర్ వ్యాఖ్యలను ఖండించడం లేదని విమర్శించారు. ఈ వివాదం ఏ వైైపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం గవర్నర్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. శివసేన ఏక్ నాథ్ షిండే, బీజేపీ కూటమిని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లు అయింది.
महाराष्ट्रात भाजपा पुरस्कृत मुख्यमंत्री होताच मराठी माणूस आणि शिवरायांचा अपमान सुरू झाला..स्वाभिमान अभिमान यावर बाहेर पडलेला गट हे ऐकूनही गप्प बसणार असेल तर शिवसेनेचे नाव घेऊ नका..मुख्यमंत्री शिंदे..राज्यपालांचा साधा निषेध तरी करा.मराठी कष्टकरी जनतेचा हा अपमान आहे..
ऐका .. ऐका… pic.twitter.com/dOvC2B0CFu— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!