Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరోసారి హాట్టాపిక్గా మారిపోయింది.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో శివసేన పార్టీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది.. విధాన సభను రద్దు చేయొచ్చంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ట్విట్టర్లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం ఆస్తికరంగా మారాయి.. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా రాజకీయాల్లో హీట్ పెరగగా.. శివసేకు ఉన్న మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో ఏక్నాథ్ షిండే వెంటే 34మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో.. ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంతో సీఎం ఉద్ధవ్ థాక్రే వైపు మిగిలింది కేవలం 21 మందే కావడంతో.. ఎప్పుడైనా సర్కార్ కూలిపోవచ్చు అంటున్నారు.
Read Also: Green India Challenge: కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్లో ఉన్నట్టుగా పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చర్చగా మారింది.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్కు కూడా కరోనా సోకింది.. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్లో ఉన్నారు. రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఐసోలేషన్కే పరిమితం కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.. ఇక, గవర్నర్ కూడా కరోనా బారినపడడంతో.. గోవా గవర్నర్కు మహారాష్ట్ర ఇంఛార్జ్ గవర్నర్గా బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు.. ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థంకానీ పరిస్థితి ఉంది.. శివసేన, ఉద్ధవ్ థాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంప్రదింపులు జరిపినా ఏక్నాథ్ షిండే దిగిరాకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. అయితే, భారతీయ జనతా పార్టీతో కలిసేప్రసక్తే లేదని ఇప్పటికే థాక్రే స్పష్టం చేశారు.. రాజీకంటే.. అసెంబ్లీని రద్దు చేయడమే బెటర్ అని వ్యాఖ్యానించారు. దీంతో, ప్రభుత్వాన్ని రద్దుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!