Viral News : బకెట్ నీళ్లు కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం లేకుండా బావిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఘుసియా గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది.
భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు ఇలాంటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నీటి కోసం భారతీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టే వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్లో, మహారాష్ట్రలో నీటి కోసం ఒక మహిళ బావిలో దిగుతున్నట్లు ఇలాంటి వీడియో వైరల్గా మారింది. అయితే తాజాగా మధ్యప్రదేశ్లోని ఘుసియా గ్రామంలోని ప్రజల నీటి కష్టాలకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. 2019 ప్రపంచ నివేదికలో “నీటి ఒత్తిడి” “అత్యంత ఎక్కువగా” ఉన్న 17 దేశాలలో భారతదేశం ఒకటి.
Also Read
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
దేశంలోని మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలు సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్లో ప్రతి వేసవిలో నీటి కొరత పునరావృతమయ్యే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి ప్రతి గ్రామానికి కుళాయి నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.కానీ ఇప్పటికీ లక్షలాది మందికి తాగునీరు అందడం లేదు. ఘుసియాలో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ సంవత్సరం స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.
#WATCH | Madhya Pradesh: People in Dindori's Ghusiya village risk their lives to fetch water from an almost dry well pic.twitter.com/jcuyLmE5xL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 2, 2022
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!