Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించండి..
- 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్..
- ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని పరిగణించండి..
- కేంద్రాన్ని కోరిన మద్రాస్ హైకోర్ట్..
Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, కెకె రామకృష్ణన్లతో కూడిన మధురై ధర్మాసనం, సురక్షితమైన ఇంటర్నెట్ వాడకంపై, ముఖ్యంగా పిల్లలు, వారి తల్లిదండ్రులలో అవగాహన కల్పించే ప్రచారాన్ని వేగవంతం చేయాలని బాలల హక్కుల సంబంధిత అధికారులకు సూచించింది.
ఇంటర్నెట్ డివైజ్లలో పేరెంటల్ విండో ఉండటం వల్ల పిల్లలకు అందుబాటులో ఉండే అభ్యంతరకరమైన అశ్లీల మెటిరియల్ ముప్పును గణనీయంగా నియంత్రించవచ్చని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన చట్టాన్ని కూడా ఆ న్యాయవాది ప్రస్తావించారు. కేంద్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టుకు విన్నవించారు. యూజర్ స్థాయిలో నియంత్రణ ఉండాలని, డివైజ్లో పేరెంట్ కంట్రోల్ యాప్ అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారని, తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉందని న్యాయమూర్తులు నొక్కి చెప్పారు. పిటిషనర్ సూచనల్ని పరిగణలోకి తీసుకుంటూ.. ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని ఆమోదించే అవకాశాన్ని పరిశీలించాలని, చట్టం ఆమోదించే వరకు క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన అవగాహన తప్పనిసరి అని వారు చెప్పారు. పిల్లల అశ్లీలత ముప్పు గురించి మరింత అవగాహన కల్పించడానికి జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, తమిళనాడు బాలల హక్కుల రక్షణ కమిషన్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని అమలు చేస్తాయని ధర్మాసనం ఆశాభావం వ్యక్తి చేసింది.
16 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలించింది. గతేడాది ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా ఆమోదించింది. డిసెంబర్ 10 నుంచి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లకు సోషల్ మీడియాను నిషేధించింది. ఈ సంస్కరణలు ఆస్ట్రేలియాలో పిల్లల జీవితాలను మారుస్తాయని, వారి బాల్యాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. అయితే, యూట్యూబ్, మెటా వంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఈ నిషేధాన్ని ఖండించాయి. చాలా మంది టీనేజర్లు కూడా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!