Mobiles ban In Temples: దేవాలయాల్లో మొబైల్ ఫోన్ బ్యాన్.. హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Bans Mobile Phones In Temples Across Tamil Nadu: దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మదురై బేంచ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది.
తూత్తుకూడిలోని తిరుచెందూర్ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయానికి చెందిన తిరిసుతంతిరర్ అయిన పిటిషనర్ ఎం సీతారామన్ తిరుచెందూర్ ఆలయంలో భక్తులు ఆంక్షలు లేకుండా ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ తీస్తున్నందుకు, తిరుచెందూర్ ఆలయంలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. ఇది ఆగమ నియమాలకు విరుద్ధమని, ఆలయ భద్రతకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. మహిళా భక్తుల సమ్మతి లేకుండా ఫోటోలు తీసే అవకాశాలు ఉన్నాయని.. వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నాడు. మదురై మీనాక్షీ సుందరేశ్వర్ ఆలయంలో మతపరమైన పవిత్రతను, భద్రత కోసం సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించాని.. భక్తులు తమ ఫోన్లను పెట్టుకునేందుకు ఆలయం వెలుపల లాకర్లను ఏర్పాటు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Read Also: Maharashtra: శ్రద్ధాను 35 ముక్కలుగా నరికాడు..నేను 70 ముక్కలుగా నరికేస్తా..
ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, జే సత్యనారాయణ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణం లోపల సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోన్లు, కెమెరాలు భక్తుల దృష్టిని మరల్చుతోందని అన్నారు.
మొబైల్ ఫోన్ల నిషేధం దేశవ్యాప్తంగా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్ర స్వామి ఆలయంలో అమలు అవుతోందని.. తిరుచెందూర్ ఆలయ అధికారులు ఆలయ ఆవరణలో మొబైల్ ఫోన్ల నిషేధం, డ్రెస్ కోడ్ కోసం చర్యలు తీసుకోవాలని, తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో ఇదే విధంగా మొబైల్స్ పై నిషేధం విధించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!