Madhya Pradesh: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇళ్లు కూల్చివేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
physical assault on minor girl in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 ఏళ్ల బాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో రేవా జిల్లాలో శనివారం 16 ఏళ్ల బాలికను ఆరుగురు వ్యక్తుల అపహరించారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. వీరందరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు కాబోయే భర్తతో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. ఈ సమయంలో దంపతులు ఆలయం సమీపంలో కూర్చొని ఉండగా.. నిందితులంతా కలిసి బాలికను అపహరించారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కాబోయే భర్తను నిందితులు కొట్టారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి.. 7 రాష్ట్రాల తీర్మానాలు
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ఈ ఘటనపై బాధితురాలికి కాబోయే భర్త పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు 22 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు 17 ఏళ్లు ఉన్న మైనర్లను, ముంబైకి చెందిన 26 ఏళ్ల వ్యక్తిని, ఇతర నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై ఐపీసీలోని పలు అత్యాచార సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
నిందితులందరూ కూలీలుగా పనిచేస్తున్నారని.. వారి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రేవాలోని నిందితుల్లో ఒకరి ఇంటిని అధికారులు సోమవారం కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఈ అధికారులు ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు రేవా జిల్లా కలెక్టర్ మోనోజ్ పుస్ప్ తెలిపారు. మిగిలిన నిందితుల ఆస్తులను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఏదైనా అక్రమ నిర్మాణంగా తేలితే వాటిని కూడా కూల్చేయనున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..