Madhya Pradesh: అంబులెన్స్ లేదు.. తోపుడుబండిలో తండ్రిని ఆస్పత్రికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Carry Father To Hospital On Handcart in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో చూపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ లేకపోవడంతో తమ వాళ్ల మృతదేశాలను బైకులపై తీసుకువెళ్లిన ఘటనలు చూశాం. చివరకు ఓ ఏడేళ్ల చిన్నవాడు తన తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన ఉన్న ఘటన కూడా మధ్యప్రదేశ్ మొరేనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
తాజాగా ఇలాంటి ఘటనే బుధవారం మరొకటి జరిగింది. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రాకపోవడంతో.. తన తండ్రిని తోపుడు బండిలో తీసుకువచ్చాడు ఓ కొడుకు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లా లహర్ పట్టణంలో జరిగింది. అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేసిన రాకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చాడు. మర్పురా గ్రామానికి చెందిన హరిస్ కృష్ణ తన తండ్రిని తోపుడుబండిలో 5 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనలకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని లహర్ ఆస్పత్రి బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ధర్మేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.
Also Read
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
Read Also: Bjp Operation Akarsh: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం
సరిగ్గా ఇలాంటి ఘటనే యూపీలో బుధవారం చోటు చేసుకుంది. జలాలాబాద్ పట్టణానికి చెందిన దినేష్ తన తల్లి బీనాదేవి(65)కు హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. ఎంతసేపు చూసిన అంబులెన్స్ రాకపోవడవంతో తన తల్లిని తోపుడు బండిలొో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లాడు. తీసుకెళ్లే సమయానికే తల్లి మరణించిందని వైద్యులు వెల్లడించారు. తిరిగి మృతదేహాన్ని అదే తోపుడు బండిలో తీసుకువచ్చాడు. అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని 108 అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!