G20 Summit: లగ్జరీ కార్కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, వంటి అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే జీ20 సమావేశాల పుణ్యమా అని లగ్జరీ కార్ల అద్దెలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సమ్మిట్కు లగ్జరీ కార్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఒక రోజు అద్దె రూ. 1 లక్షకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 30 లగ్జరీ హోటళ్లు బుక్ అయ్యాయి.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Indian Tech Worker: కెనడా బాట పట్టిన భారత టెక్కీలు.. 12 నెలల్లో 15 వేల మంది..
ఈ సమ్మిట్ కోసం దాదాపుగా 29 మంది దేశాధినేతలు భారత్ వస్తున్నారు. జీ 20 దేశాల అధినేతలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అగ్రనేతలు ఉన్నారు. ఇలా అగ్రనేతలకు, ఉన్నతాధికారులకు వీరిని సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు లగ్జరీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఉన్న కార్లలో మెర్సిడెస్ మేబ్యాక్ ఉంది, దీని కోసం అడిగే అద్దె ధర రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.మ మెర్సిడెస్ తో పాటు బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు ట్రాన్స్పోర్ట్ సంస్థలు చెబుతున్నాయి.
అగ్రదేశాల అధినేతలు వస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్జీ, పారాకమాండోలు రంగంలో దిగారు. వీరితో పాటు ఆయా దేశాల అధినేతల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఢిల్లీకి చేరుకుంటోంది. భద్రత కోసం అత్యధునిక ఏఐ కెమెరాలను, ఇతర టెక్నాలజీని వాడుతున్నారు. దీంతో పాటు అమెరికా సీఐఏ, యూకే ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్ఎస్ వంటి అంతర్జాతీయ గూఢాచార సంస్థలు బృందాలు తమ నాయకులు భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడానికి ఢిల్లీ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!