G20 Summit: లగ్జరీ కార్కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, వంటి అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే జీ20 సమావేశాల పుణ్యమా అని లగ్జరీ కార్ల అద్దెలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సమ్మిట్కు లగ్జరీ కార్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఒక రోజు అద్దె రూ. 1 లక్షకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 30 లగ్జరీ హోటళ్లు బుక్ అయ్యాయి.
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Read Also: Indian Tech Worker: కెనడా బాట పట్టిన భారత టెక్కీలు.. 12 నెలల్లో 15 వేల మంది..
ఈ సమ్మిట్ కోసం దాదాపుగా 29 మంది దేశాధినేతలు భారత్ వస్తున్నారు. జీ 20 దేశాల అధినేతలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అగ్రనేతలు ఉన్నారు. ఇలా అగ్రనేతలకు, ఉన్నతాధికారులకు వీరిని సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు లగ్జరీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఉన్న కార్లలో మెర్సిడెస్ మేబ్యాక్ ఉంది, దీని కోసం అడిగే అద్దె ధర రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.మ మెర్సిడెస్ తో పాటు బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు ట్రాన్స్పోర్ట్ సంస్థలు చెబుతున్నాయి.
అగ్రదేశాల అధినేతలు వస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్జీ, పారాకమాండోలు రంగంలో దిగారు. వీరితో పాటు ఆయా దేశాల అధినేతల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఢిల్లీకి చేరుకుంటోంది. భద్రత కోసం అత్యధునిక ఏఐ కెమెరాలను, ఇతర టెక్నాలజీని వాడుతున్నారు. దీంతో పాటు అమెరికా సీఐఏ, యూకే ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్ఎస్ వంటి అంతర్జాతీయ గూఢాచార సంస్థలు బృందాలు తమ నాయకులు భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడానికి ఢిల్లీ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!