Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఏకంగా శీలానికి తాళం వేశాడు దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
ఇది కూడా చదవండి: Payal Rajput: ప్రభాస్ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
నేపాల్కు చెందిన ఉపేంద్ర హుడాకే (30) తన భార్యతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నాడు. పింప్రి-చించ్వాడ్లోని వాకాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. హుడాకే సోదరి, మరికొందరు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రోజూ తాగొచ్చి అనుమానంతో భార్యతో గొడవ పడుతున్నాడు. అంతటితో ఆగకుండా మృగంగా మారి.. భార్య జననాంగాలను ఇనుప మేకులతో ఛిద్రం చేసి తాళం వేశాడు. ఈ దారుణ ఘటన మే 11న జరిగింది. బాధితురాలి ఆక్రందనలు విన్న సహచర నేపాలీయులు ఆమె పరిస్థితిని చూసి ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమె ఇప్పటివరకు చికిత్స పొందుతూ వచ్చింది. మే 16న (గురువారం) డిశ్చార్జ్ కావడంతో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని, ఆరోగ్యం మెరుగుపడిందని పోలీసులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు నేపాల్కు చెందిన ఉపేంద్ర హుడాకే (30)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
దంపతులిద్దరూ నేపాల్కు చెందిన వారని.. పనుల నిమిత్తం పూణె వచ్చి నివాసం ఉంటున్నారని దర్యాప్తు అధికారి బాలాజీ మేటే తెలిపారు. నేపాల్లోని ఒక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ఉపాధి కోసం మే నెల ప్రారంభంలో పూణెకు వచ్చారన్నారు. హుడాకే సోదరి కూడా వీరితోనే ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో హుడాకే ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. ఆమెను విపరీతంగా కొట్టి.. భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె శీలానికి స్క్రూలు, ఇత్తడి తాళాన్ని వేసినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న నేపాలీయులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చింపినట్లుగా పేర్కొన్నారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని.. శస్త్రచికిత్స తర్వాత ఆమె కోలుకుందని బాలాజీ మేటే చెప్పుకొచ్చారు. ఆమె పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tarun: రీఎంట్రీకి సిద్దమైన తరుణ్.. తల్లి రోజా రమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..