Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఏకంగా శీలానికి తాళం వేశాడు దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
ఇది కూడా చదవండి: Payal Rajput: ప్రభాస్ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
నేపాల్కు చెందిన ఉపేంద్ర హుడాకే (30) తన భార్యతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నాడు. పింప్రి-చించ్వాడ్లోని వాకాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. హుడాకే సోదరి, మరికొందరు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రోజూ తాగొచ్చి అనుమానంతో భార్యతో గొడవ పడుతున్నాడు. అంతటితో ఆగకుండా మృగంగా మారి.. భార్య జననాంగాలను ఇనుప మేకులతో ఛిద్రం చేసి తాళం వేశాడు. ఈ దారుణ ఘటన మే 11న జరిగింది. బాధితురాలి ఆక్రందనలు విన్న సహచర నేపాలీయులు ఆమె పరిస్థితిని చూసి ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమె ఇప్పటివరకు చికిత్స పొందుతూ వచ్చింది. మే 16న (గురువారం) డిశ్చార్జ్ కావడంతో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని, ఆరోగ్యం మెరుగుపడిందని పోలీసులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు నేపాల్కు చెందిన ఉపేంద్ర హుడాకే (30)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
దంపతులిద్దరూ నేపాల్కు చెందిన వారని.. పనుల నిమిత్తం పూణె వచ్చి నివాసం ఉంటున్నారని దర్యాప్తు అధికారి బాలాజీ మేటే తెలిపారు. నేపాల్లోని ఒక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ఉపాధి కోసం మే నెల ప్రారంభంలో పూణెకు వచ్చారన్నారు. హుడాకే సోదరి కూడా వీరితోనే ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో హుడాకే ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. ఆమెను విపరీతంగా కొట్టి.. భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె శీలానికి స్క్రూలు, ఇత్తడి తాళాన్ని వేసినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న నేపాలీయులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చింపినట్లుగా పేర్కొన్నారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని.. శస్త్రచికిత్స తర్వాత ఆమె కోలుకుందని బాలాజీ మేటే చెప్పుకొచ్చారు. ఆమె పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tarun: రీఎంట్రీకి సిద్దమైన తరుణ్.. తల్లి రోజా రమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!