LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Subsidy Cut: ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో భారాన్ని మోపేందుకు రెడీ అవుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసే దిశగా చమురు కంపెనీలు కసరత్తు స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైబడి ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు.
ఎవరికి సబ్సిడీ రద్దు అవుతుందంటే..
ఆదాయపు పన్ను రిటర్నుల ఆధారంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. ఎవరి కుటుంబ వార్షిక ఆదాయం అయితే రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో, వారు ఇకపై గ్యాస్ సబ్సిడీని కోల్పోనున్నారు. ఐటీ రికార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తున్నారు. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే వినియోగదారులకు ఇప్పటికే వారి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు చమురు కంపెనీల నుంచి మెసేజ్లు వెళ్లాయి. మీ ఆదాయం రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి సబ్సిడీ నిలిపివేస్తున్నామని ఆ మెసేజ్లలో గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
అభ్యంతరాలు తెలపడానికి ఛాన్స్
ఒకవేళ చమురు కంపెనీల నిర్ణయంతో ఏకీభవించని వారు లేదా తమ ఆదాయం పరిమితి రూ.10 లక్షల లోపే ఉందని భావించే వారు 7 రోజుల గడువులోగా స్పందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వినియోగదారులు సంబంధిత చమురు కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్ పోర్టల్లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే, సబ్సిడీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. లాస్ట్ మూడు నాలుగు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వినియోగదారుడికి నేరుగా సబ్సిడీ అందడం లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు (ఉదాహరణకు దీపం పథకం వంటివి) మాత్రమే కొన్ని వర్గాల వారికి అందుతున్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా చాలా మంది వినియోగదారులకు ఈ మెసేజ్లు రావడం వారిని అయోమయానికి గురి చేస్తుంది. భవిష్యత్తులో కొత్తగా సబ్సిడీని ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందేమోనని, అందుకే ఈ వడపోత ప్రక్రియ చేపట్టి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!