Himanta Biswa Sarma: “మహాదేవ్”ని కూడా విడిచిపెట్టడం లేదు.. సీఎం బఘేల్పై అస్సాం సీఎం విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్పై అస్సా్ం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ని టార్గెట్ చేశారు. భగవాన్ మహదేవ్ని కూడా విడిచి పెట్టడం లేదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 17న ఛత్తీస్గఢ్ రెండో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున హిమంత ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలకు, నక్సలైట్లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. గిరిజనులను మతమార్పిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
Read Also: Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
‘‘ ఇటీవల నేను బిలాస్పూర్లో ఉన్నప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా భూపేష్ బఘేల్కి రూ.508 కోట్లు అందాయని తెలిసింది. ఈడీ తక్కువ డబ్బును రాసిందనిపిస్తోందని, అంతకంటే ఎక్కువ డబ్బు ఈ కుంభకోణంలో లూటీ చేయబడింది. బఘేల్ సీఎంగా 2.5 ఏళ్లు, మిగిలిన 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని అనునకున్నారు. బఘేల్ మొత్తం పదవీకాల పెరిగింది. ఇది డబ్బు మార్పిడి లేకుండా సాధ్యం కాదు’’ అని హిమంత బిశ్వ సర్మ ఆరోపించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల ద్వారా సీఎం బఘేల్ కి రూ.508 కోట్లు చెల్లించారని, డబ్బుతో పట్టుబడిన కొరియర్లు వాగ్మూలం ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్ని బఘేల్ ఖండించారు. ఇది బీజేపీ నాటకమని విమర్శించారు.
బెట్టింగ్ యాప్కి హిందూదేవుడి పేరు పెట్టడంపై హిమంత శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాప్ కి భూపేష్ అని పెట్టడం లేదా.. హిమంత అనే పేరు పెట్టాల్సింది.. కానీ దానికి మహాదేవ్ పేరు పెట్టారు, ఇప్పడు బఘేల్ మహాదేవ్ ని వదల్లేదు, ప్రతీ పైసా ఖాతాలో వేసుకుంటాడని, మీరు మీ ఖాతా ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ హిమంత అన్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్ కుంభకోణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని బీజేపీ నేత హెచ్చరించారు. మహదేశ్ పేరుతో మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్నారు.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!