Lok Sabha Elections 2024: “నితీష్ నుంచి అప్నాదళ్ వరకు”.. ఇండియా కూటమిని వదిలివెళ్లిన పార్టీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటాని చెబుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, కొన్ని రోజులకు ఈ కూటమిలోని ఒక్కో పార్టీ వెళ్లిపోయి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాయి. ఇండియా కూటమికి ఆధ్యుడిగా భావించే బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో చేరి బిగ్ షాక్ ఇచ్చారు. మరోవైపు తృణమూల్ సుప్రిమో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కూటమికి అంటీముట్టనట్లు ఉంటున్నారు.
Read Also: Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
ఇండియా కూటమిని వదిలిన పార్టీలు ఇవే:
ఆర్ఎల్డీ:
దేశంలో అధికారానికి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్లో, ముఖ్యంగా రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రభావం చూపించే జయంత్ చౌదరికి చెందిన ‘రాష్ట్రీయ లోక్ దళ్’ అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీతో జతకట్టింది.
అప్నాదళ్ (కామెరవాడి): కొద్ది రోజుల క్రితం సమాజ్వాదీ పార్టీతో పొత్తులో భాగమైన పల్లవి పటేల్, సంకీర్ణాన్ని విడిచిపెట్టి, రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు.
వీబీఏ: ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మహా వికాస్ అఘాడిని విడిచిపెట్టింది. మహారాష్ట్రలోని కాంగ్రెస్-శివసేన(యూబీటీ)-ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని కూటమిలో సీట్ల షేరింగ్లో విబేధాలు రావడంతో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది.
ఎన్సీపీ (అజిత్ పవార్): మహారాష్ట్రలో అత్యంత కీలకమైన ఎన్సీపీ పార్టీలో లుకలుకలు ఆ పార్టీని రెండుగా చీల్చాయి. అయితే, శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో చేరారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్టు కూడా అజిత్ పవార్కే ఉంది. ప్రస్తుతం ఎన్సీపీ(అజిత్ పవార్) ఎన్డీయేలో ఉంది.
హెచ్ఏఎం: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్) చీఫ్ జీతన్ రామ్ మాంఝీ గతేడాది ఎన్డీయే కూటమిలో చేరారు. అంతకుముందు కొంతకాలం ఈ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!