Messi-Vantara: వంతారాను సందర్శించిన మెస్సీ.. ఫొటోలు వైరల్
- భారత్లో ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన
- జామ్నగర్లో వంతారాను సందర్శించిన మెస్సీ
- అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో కలిసి సందర్శన
- భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక పర్యటనలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా ఫారెస్ట్ను సందర్శించారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ స్వయంగా స్వాగతం పలికి జంతువులను చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రం వంతారాను స్థాపించారు. అనంత్ అంబానీ ఆహ్వానం మేరకు లియోనెల్ మెస్సీ మంగళవారం వంటారాను సందర్శించారు. ముందుగా సాంప్రదాయ హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివ అభిషేకాలు చేశారు. అనంతరం జంతువులను సందర్శించారు. మెస్సీతో పాటు అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఉన్నారు. ఇక మెస్సీ వంటారాను సందర్శించినందుకు గుర్తుగా ఫోస్టర్ కేర్ సెంటర్లో ఒక సింహం పిల్లకు ‘లియోనెల్’ అనే పేరు పెట్టారు.

దేశంలోనే కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో మెస్సీ పర్యటించారు. ఇక కోల్కతా పర్యటనలో గందరగోళం నెలకొంది. ఇక పర్యటన ముగించుకుని వెళ్తుండగా భారత ప్రజల ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నమస్తే ఇండియా! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతాకు ఎంత అద్భుతమైన సందర్శనలు. నా పర్యటన అంతటా ఆత్మీయ స్వాగతం. గొప్ప ఆతిథ్యం, ప్రేమకు ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను!’’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.



తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?