Ahmedabad Plane Crash: బాధిత కుటుంబాల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం
- బాధిత కుటుంబాల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం
- ఏదైనా ప్రభుత్వ పత్రంతో పరిహారాన్ని అందిస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాల కోసం బీమా నిబంధనలను సడలించింది. మరణ ధృవీకరణ పత్రం స్థానంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ విమానయాన సంస్థలు చెల్లించే ఏదైనా ప్రభుత్వ పత్రంతో పరిహారాన్ని అందిస్తామని వెల్లడించింది. క్లెయిమ్లు త్వరగా పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎల్ఐసీ స్పష్టం చేసింది. తమ కాల్సెంటర్ / సమీప కార్యాలయాన్నీ సంప్రదించొచ్చని వివరించింది. అలాగే బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేక క్లెయిమ్ సెటిల్మెంట్ డెస్క్ ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో చనిపోయిన మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఈ సాయం బీమా పరిహారంతో ఎలాంటి సంబంధం ఉండదు. బీమా సదుపాయంతోనే రూ.కోటి పరిహారం అందనుంది. ఇదిలా ఉంటే ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరిస్తు్న్నారు. డీఎన్ఏ పరీక్షల తర్వాత మరణ ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!