Supreme Court: స్వశక్తితో పోటీ చేయండి.. అజిత్ పవార్కు సుప్రీంకోర్టు ఆదేశం
- స్వశక్తితో పోటీ చేయండి
- శరద్ పవార్ ఫొటోలు.. వీడియోలు ఉపయోగించొద్దు
- అజిత్ పవార్కు సుప్రీంకోర్టు ఆదేశం
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓ వైపు ఇండియా కూటమి.. ఇంకోవైపు ఎన్డీఏ కూటమి నువ్వానేనా? అన్నట్టుగా సై అంటున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం.. శరద్పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగిస్తోంది. దీనిపై శరద్ పవార్ వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. అజిత్ పవార్ వర్గానికి చురకలు వేసింది. శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగించొద్దని సూచించింది. సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని హితవు పలికింది.
ఇది కూడా చదవండి: IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్గా పార్థివ్ పటేల్ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-ఏక్నాథ్ షిండే సర్కారుకు అజిత్ పవార్ మద్దతు పలికి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోగా.. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవర్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ శరద్ పవార్ దృశ్యాలను వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ‘‘మీ సొంత కాళ్ళపై నిలబడటం నేర్చుకోండి..’’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Jharkhand Polls: జార్ఖండ్లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: JIO Data Recharge: జియో కస్టమర్స్కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా
తాజావార్తలు
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!