IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్గా పార్థివ్ పటేల్ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్.
- పార్థివ్ పటేల్ను తమ సహాయక సిబ్బందిలో.
- బ్యాటింగ్ & అసిస్టెంట్ కోచ్గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్గా పార్థివ్ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్గా, ముంబై ఎమిరేట్స్కు బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే ఐపీఎల్ సీజన్కు సిద్ధమవుతోంది. పార్థివ్ జట్టు బ్యాట్స్మెన్స్ కు కీలక పాత్ర పోషిస్తాడు. అతను యువ ప్రతిభకు మార్గనిర్దేశం చేయడం, కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేయడం, వారి అభివృద్ధికి దోహదపడటం వంటి వాటికి ప్రసిద్ధి చెందాడు. ఇకపోతే, గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్లకు చేరుకోవడంలో విఫలమైంన సంగతి తెలిసిందే.
Read Also: JIO Data Recharge: జియో కస్టమర్స్కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ఐపీఎల్ 2024లో, గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో 5 మ్యాచ్లను గెలచి, 7 మ్యాచ్లలో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయితే , ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆ జట్టు ఛాంపియన్గా నిలిచింది. పార్థివ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ , కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్తో సహా 6 జట్లకు ఆడాడు. అతను ఐపీఎల్ 2020లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉన్నాడు. కానీ, అతనికి ఏ మ్యాచ్నూ ఆడే అవకాశం రాలేదు. అతను 139 IPL మ్యాచ్లలో 22.6 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
భారతదేశం తరపున 25 టెస్టుల్లో 31 సగటుతో 934 పరుగులు చేసిన పార్థివ్ డిసెంబర్ 09, 2020న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టెస్టుల్లో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో 71 అతని అత్యధిక స్కోరు. భారత్ తరఫున అతను 38 వన్డేల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 736 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95. ఇక అతను కేవలం 2 T-20 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. అందులో అతను 36 పరుగులు చేశాడు.
https://twitter.com/gujarat_titans/status/1856635530374676744
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?