Priyanka Gandhi: రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి.. ప్రధాని మోడీకి సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో పోలుస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనపై కాంగ్రెస్ నేతలు 91 సార్లు దూషణలకు పాల్పడ్డారని అన్నారు.
Read Also: CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న పంజాబ్.. 10 ఓవర్లకు స్కోర్ ఇదే..
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
ఈ రోజు కర్ణాటకలో ని బాగల్ కోట్ జిల్లాలో జరిగి బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. మీకు జరిగిన దూషణలు కేవలం ఒక పేజీలో సరిపోతాయని, మీరు నా కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు ఒక పుస్తకమే నిండుతుందని ఆమె అన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్రమోడీని చూస్తే వింతగా ఉందని, నేను చాలా మంది ప్రధానులను చూశాను, ఇందిరాగాంధీ దేశం కోసం బుల్లెట్ గాయాలను తీసుకుంది, రాజీవ్ గాంధీ తన ప్రాణాలు అర్పించారు, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశం కోసం కష్టపడ్డారు, కానీ మోడీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని ప్రియాంకాగాంధీ అన్నారు.
ప్రజల బాధలను వినేందుకు వచ్చే ప్రధానులను చూశాను కానీ, తనను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని మోడీనే చూశానని ఆమె అన్నారు. ‘‘నా సోదరుడు రాహుల్ గాంధీని చూసి దైర్యం తెచ్చుకోండి మోడీజీ.. ఈ దేశం కోసం బుల్లెట్ దెబ్బలుతినేందుకు సిద్ధంగా ఉన్నారు, మీరు దూషించినా, కాల్చి చంపినా, నిజం కోసం నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పాడు’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!