Rahul Gandhi: రేపు సంభాల్కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ఇటీవల మసీదు సర్వేలో హింస..
- రేపు సంభాల్కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు..
- ఇటీవల మసీదు సర్వే సమయంలో హింసాత్మక ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్లో ఇటీవల హింస చెలరేగిన సంభాల్కి రేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ బృందంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 24న యూపీలోని సంభాల్లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో వేల సంఖ్యలో గుంపు అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
Read Also: Cement Prices: 5 ఏళ్ల కనిష్టానికి సిమెంట్ ధరలు.. కారణం ఇదే…
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 20కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్తో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని పోలీసులు అభియోగాలు మోపారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున తమ పార్టీ బృందాన్ని సంభాల్ వెళ్లకుండా యూపీ పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత సచిన్ చౌదరి ఆరోపించారు. సంభాల్ హింసపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మొఘలుల కాలం నాటి ఈ మసీదు ఒకప్పుడు హరిహర మందిరమని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. సర్వేకి వెళ్లిన సమయంలోనే హింసాత్మక దాడులు జరిగాయి. బాబర్ కాలంలో నాటి ఈ మసీదుని ఆయన స్థానంలో హిందూ బేగ్ అనే వ్యక్తి నిర్మించినట్లు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మొఘలుల కాలం నాటి ‘‘బాబర్ నామా’’; ‘‘ఐన్ ఈ అక్బరీ’’ గ్రంథాల్లో ఈ మసీదు ప్రస్తావన ఉంది. దీనిని హిందూ పక్షం కోర్టులో లేవనెత్తింది.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!