Section 498A: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య.. వరకట్న చట్టాలపై చర్యలకు లాయర్ల డిమాండ్..
- అతుల్ సుభాష్ సూసైడ్ కేసుపై దేశవ్యాప్తంగా చర్చ..
- వరకట్న చట్టాల దుర్వినియోగంపై లాయర్ల ఆందోళన..
- సెక్షన్ 498A చట్టం మిస్ యూజ్పై కఠిన చర్యలకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Section 498A: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
ఈ కేసు నేపథ్యంలో వరకట్న వేధింపులకు సంబంధించి సెక్షన్ 498A దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాలని పలువురు లాయర్లతో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. లాయర్ అడ్వకేట్ వికాస్ పహ్వా బుధవారం ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని కోరారు. మూడు దశాబ్ధాలుగా క్రిమినల్ లాయర్గా గుర్తింపు పొందిన పహ్వా మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగతంగా సెక్షన్ 498A దుర్వినియోగం చేయడాన్ని తాను చూశానని చెప్పారు. వరకట్న వేధింపులకు సంబంధించిన వాస్తవ ఉదంతాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా సమస్యలు పరిష్కరించాలని భర్త, అతడి కుటుంబాలపై ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు నిరాధారమైనవి ఉన్నాయని, చట్టాన్ని తప్పుగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Low Fertility Rate: వారానికి 4 రోజులే పని..సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ కీలక నిర్ణయం..
క్రిమినల్ కేసులు వాదించడంలో పేరు సంపాదించిన మరో న్యాయవాది సుమిత్ గెహ్లాట్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నిబంధనల ద్వారా భర్తనే కాకుండా మొత్తం కుటుంబాన్ని కూడా వేధించడానికి కొందరు ఆయుధంగా వాడుతున్నారని చెప్పారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మానసిక క్షోభ, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు, కొన్ని సందర్భాల్లో విషాదకరమైన ఘటనలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ఈ చట్టాన్ని బాధితుల రక్షణ కోసం, కానీ దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి భద్రతా చర్యలు తప్పనిసరి అని చెప్పారు.
అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ విఫలమైన వివాహాలు కేవలం విడాకులతో ముగిసే వాతావరణాన్ని సృష్టించాయని, కానీ తరచూ భర్తకు దీర్ఘకాల దుస్థితికి దారితీస్తుందని క్రిమినల్ లాయర్ ఆశిష్ దీక్షిత్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో భారీగా భరణం డిమాండ్ చేయడం భర్తల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నట్లు వెల్లడించారు. పెళ్లయిన కొన్ని నెలలే అయిన భర్తల నుంచి విపరీతమైన భరణం డిమాండ్ చేయడంతో వారి జీవితాలను క్లిష్టతరంగా మారుతున్నాయని అన్నారు. క్రిమినల్ లాయర్ జూహీ అరోరా కూడా ఇలాంటి దుర్వినియోగాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు, సుప్రీంకోర్టు వరకట్న వేధింపుల కేసును విచారిస్తు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం.. సెక్షన్ 498A దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!