Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్
- లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్..
- స్నాప్చాట్లో 24 గంటల్లోపు మాయమయ్యే ఆప్షన్ను ఉపయోగించి చాటింగ్..
- సిద్ధిఖీ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాం: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawrence Bishnoi: ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య సంచలనం రేపింది. కాగా, ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. సిద్ధిఖీని హత్య చేయడానికి ముందు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్తో షూటర్లు సంప్రదింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్నాప్చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. స్నాప్చాట్లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్ను ఉపయోగించి సంప్రదింపులు చేశారని.. దాని ద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు వెల్లడించారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Read Also: Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ఇక, స్నాప్చాట్లో 24 గంటల తర్వాత మెసేజ్లు మాయమయ్యే ఆప్షన్ ఉండటం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సిద్ధిఖీపై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది.
Read Also: Yadadri Temple: భక్తులకు అలర్ట్.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..
అయితే, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీకి సంబంధం ఉన్నందు వల్లే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు సహాయం చేసే ఎవరిని కూడా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. దీంతో పాటు సిద్దిఖీ కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్లిస్ట్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!