Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్
- లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్..
- స్నాప్చాట్లో 24 గంటల్లోపు మాయమయ్యే ఆప్షన్ను ఉపయోగించి చాటింగ్..
- సిద్ధిఖీ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాం: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawrence Bishnoi: ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య సంచలనం రేపింది. కాగా, ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. సిద్ధిఖీని హత్య చేయడానికి ముందు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్తో షూటర్లు సంప్రదింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్నాప్చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. స్నాప్చాట్లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్ను ఉపయోగించి సంప్రదింపులు చేశారని.. దాని ద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు వెల్లడించారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Read Also: Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ఇక, స్నాప్చాట్లో 24 గంటల తర్వాత మెసేజ్లు మాయమయ్యే ఆప్షన్ ఉండటం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సిద్ధిఖీపై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది.
Read Also: Yadadri Temple: భక్తులకు అలర్ట్.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..
అయితే, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీకి సంబంధం ఉన్నందు వల్లే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు సహాయం చేసే ఎవరిని కూడా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. దీంతో పాటు సిద్దిఖీ కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్లిస్ట్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!