ED: లాలూ అక్రమ సంపాదన రూ.600 కోట్లు.. రూ.150 కోట్ల భవనాన్ని 4 లక్షలకే కొనుగోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, పాట్నా, ముంబాయ్, రాంచీల్లోని పలు ప్రదేశాల్లోని 25 చోట్ల దాడులు జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం రూ. 600 కోట్ల అక్రమార్జన బయటకి వచ్చినట్లు ఈడీ శనివారం వెల్లడించింది. ఇందులో రూ.350 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు బినామీల ద్వారా రూ. 250 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తేలిపింది. వీటితో పాటు 540 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ. 1.25 కోట్ల విలువైన 1.5 కేజీల బంగారు అభరణాలు, 1900 అమెరికన్ డాలర్లతో కలిపి రూ.1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
రైల్వే మంత్రి ఉన్న సమయంలో లాలూ నిరుద్యోగుల నుంచి అతి తక్కువ ధరలో భూములను సొంత చేసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్నే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ. 250 కోట్లుగా ఉందని ఈడీ తేల్చింది. ఇందుకు సంబంధించిన బినామీలు, షెల్ కంపెనీలను ఈడీ గుర్తించింది. ఇదిలా ఉంటే సౌత్ ఢిల్లీలోని రూ. 150 కోట్ల నాలుగంతస్తుల భవనాన్ని కేవలం రూ. 4 లక్షలకే కొనుగోలు చేసినట్లు తేలింది. ఇది ఏబీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ బీహార్ డిఫ్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
అక్రమంగా సంపాదించిన డబ్బును చెలామణిలోకి తేవడానికి ముంబైకి చెందిన నగలు, ఆభరణాలు బిజినెస్ సంస్థలను ఉపయోగించినట్లు ఈడీ కనుక్కుంది. ప్రస్తుతం ఈ ఢిల్లీలోని భవనం ఓ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయింది. కానీ దీంట్లో తేజస్వీ కుటుంబం నివాసం ఉంటోంది. ఇదిలా ఉంటే రైల్వే గ్రూప్-డి ఉద్యోగుల నుంచి లాలూ రూ. 7.5 లక్షలకు నాలుగు ప్రావర్టీలను కొనుగోలు చేయగా.. వాటిని ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ అబూ దోజానాకు రూ. 3.5 కోట్లకు విక్రయించినట్లు తేలింది. లాలూ హయాంలో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో వివిధ రైల్వే జోన్లలో నియమితులైన ఉద్యోగుల్లో 50 శాతం మంది లాలూ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలకు చెందిన వారే. ప్రస్తుతం ఈ కేసులో లాలూ కుటుంబసభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరిపై విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!