Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు
- నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి
- లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన రాజకీయ జీవితాన్ని ఐదు కుటుంబాలు నాశనం చేశాయని.. వారి పేర్లు వెల్లడిస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా లాలూ కుమారుడు, ఆర్జేడీ మాజీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక యువతితో దిగిన ఫొటో వైరల్ కావడంతో ఆర్జేడీ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ‘టీం తేజ్ ప్రతాప్ యాదవ్’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించి బీహార్ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: జంతు ప్రేమికులకు ఊరట.. వీధి కుక్కల తీర్పుపై కీలక పరిణామం
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తేజ్ ప్రతాప్ యాదవ్.. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు. తేజస్వి యాదవ్ సోదరుడు. ప్రస్తుతం రాజీకాయాల్లోనూ.. సొంత కుటుంబం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తేజ్ ప్రతాప్ పెట్టిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. గతంలో అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫొటో వైరల్ కావడంతో ఆరు సంవత్సరాలు పాటు కుటుంబం నుంచి, పార్టీ నుంచి వేటుకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని.. కుట్ర కూడా చేయలేదన్నారు. కానీ ఐదు కుటుంబాలు మాత్రం తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాయన్నారు. ఆ ఐదు కుటుంబాల పేర్లు శుక్రవారం వెల్లడిస్తానని.. వారి ముఖాలు, స్వభావాన్ని ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. కుట్రలను బహిర్గతం చేయబోతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్ రూమ్లో తిట్టాడని టీచర్ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే తేజ్ ప్రతాప్ ఖండించారు. తన ఫేస్బుక్ను ఎవరో హ్యాక్ చేశారని… తన వ్యతిరేకులు వివాదాస్పద కంటెంట్ను పోస్ట్ చేశారని కొట్టిపారేశారు. పోస్ట్ వివాదం కావడంతో ఈ మధ్యలో ఏం జరిగిందో.. ఏమో తెలియదుగానీ మొత్తానికి తేజ్ ప్రతాప్ వెనక్కి తగ్గారు.
ప్రస్తుతం బీహార్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు తేజ్ ప్రతాప్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రత్యర్థులను ‘జయచంద్ (దేశద్రోహి)’ అనే పదంతో పదే పదే లక్ష్యంగా విమర్శిస్తున్నారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి ‘జయచంద్’ల బృందం తనపై కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!