Operation Sindoor: రావణుడు లక్ష్మణ రేఖ దాటితే లంక కాలిపోయింది.. పాకిస్తాన్కి కూడా అదే గతి..
- రావణుడు లక్ష్మణరేఖ దాటడంతో లంక నాశనం..
- భారత్ రెడ్ లైన్ దాటి పాకిస్తాన్కు అదే గతి..
- పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి..
- ఆపరేషన్ సిందూర్పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు..
Operation Sindoor: పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్పై ఈ రోజు సభలో చర్చ జరగడానికి ముందు, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. రామాయణాన్ని ఉటంకిస్తూ, పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఆపరేషన్ సిందూర్పై ఈ రోజు చర్చ ప్రారంభం.. రావణుడు లక్ష్మణ రేఖను దాటినప్పుడు, లంక కాలిపోయింది. భారతదేశం గీసిన రెడ్ లైన్ పాకిస్తాన్ దాటినప్పుడు, ఉగ్రవాద శిబిరాలు అగ్నికి ఆహుతయ్యాయి’’ అని ఎక్స్లో ఒక పోస్టులో రాశారు.
ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్ లో చర్చ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోడీ ఒప్పుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్ని యుద్ధవిమానాలు కోల్పోయామో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం ఇవ్వాలని విపక్షాలు అడుగుతున్నాయి. అయితే, రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య సంప్రదింపుల తర్వాతే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్ ప్రేమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.
Discussion on #OperationSindoor to begin today…
When Ravan crossed the Laxman Rekha, Lanka burned. When Pakistan crossed the red lines drawn by India, terrorist camps faced the fire!
जब रावण ने लक्ष्मण रेखा पार की, तो लंका जल गई। जब पाकिस्तान ने भारत द्वारा खींची गई लाल रेखा… pic.twitter.com/GHh6MtkzsL— Kiren Rijiju (@KirenRijiju) July 28, 2025
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?