Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- అరుణాచల్లో చైనా చొరబాటు ఆరోపణలపై కేంద్ర మంత్రి స్పందన..
- చొరబాటు జరగలేదని స్పష్టం చేసిన కిరణ్ రిజిజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లో చైనా 60 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చిందన్న వాదనల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. ఈ ప్రచారం తప్పని, భారత్-చైనాల మధ్య అరుణాచల్లో సరిహద్దు చాలా పొడవుగా ఉందని, భూభాగంపై సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా గుర్తించబడలేదని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్లోని అప్పర్ సుబాన్సిరి జిల్లాలో చైనా చొరబాటుకు పాల్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తక్సింగ్ ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దాటి భారత భూభాగంలోకి వచ్చారని స్థానికులు ఆరోపించారు.
అరుణాచల్తో సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా డీమార్క్ కాలేదని రిజిజు చెప్పారు. భారత్-టిబెట్ మధ్య సరిహద్దు గతంలో పూర్తిగా గుర్తించలేదని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయని, స్థానిక గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే సమయంలో తప్పుడు వీడియోలు, నిర్ధారణ లేని ఆరోపణల్ని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రచారం మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు దేశాన్ని గందరగోళానికి గురిచేస్తాయని అన్నారు. అయితే స్థానికుల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) గస్తీని కూడా పెంచినట్లు వెల్లడించారు.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
భారత సరిహద్దుల్లో చైనా రహదారుల నిర్మాణాలు చాలా కాలం క్రితమే ప్రారంభమైందని రిజిజు తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సరిహద్దు వద్ద భారత మౌలిక సదుపాయాలను నిర్మించకూడదన్న విధానాన్ని పార్లమెంట్లో వెల్లడించారని రిజిజు పేర్కొన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?