Delhi Drug Case: రూ. 5000 కోట్ల డ్రగ్స్ కేసు.. ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్కి సంబంధం..
- ఢిల్లీలో పట్టుబడిన రూ.5000 కోట్ల విలువైన డ్రగ్స్..
- ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Drug Case: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన కేసులో ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ కార్యకర్త అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యకర్తగా ఆరోపించబడుతున్న ఇతడికి ఆ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన దాడిలో రూ. 5600 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్,40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి తుషార్ గోయల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
40 ఏళ్ల గోయల్ 2022 వరకు ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్గా పనిచేశారని విచారణ సందర్భంగా అంగీకరించాడు. గోయల్ తన సోషల్ మీడియా ప్రొఫైల్లో ఆర్టీఐ చైర్మన్, ఢిల్లీ పీసీసీ అని పెట్టుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇతను లోక్సభ ఎంపీ దీపేందర్ సింగ్, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్తో సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Minister Savita: బీసీ కుల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత..
ఈ కేసులో గోయల్తో పాటు ఢిల్లీకి చెందిన హిమాన్షు కుమార్, ఔరంగజేబ్ సిద్ధికీ, భరత్ కుమార్ జైన్లతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొకైన్ వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి స్మగ్లింగ్ అవుతోందని, గంజాయి థాయ్లాండ్ లోని ఫుకెట్ నుంచి వచ్చినట్లు తేలింది. నిందితులు క్రిప్టోకరెన్సీని ఉపయోగించి నిఘా వర్గాల నుంచి తప్పించుకున్నారు. కొకైన్ రవాణా వెనక దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రయేయం తెలుస్తోంది. ఢిల్లీలో హై ప్రొఫైల్ పార్టీలకు ఈ డ్రగ్స్ సరఫరా చేయబడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్ కార్టెల్ ప్రధాన సూత్రధాని పశ్చిమాసియా దేశం నుంచి భారతదేశంలో తన కార్యకలాపాలను నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!