MP Imran Masood: ‘‘మూడు కాకుల్ని చంపారు’’.. “సర్జికల్ స్ట్రైక్స్”పై మరో కాంగ్రెస్ నేత..
- ‘‘మూడు కాకుల్ని చంపారని పాక్ చెబుతోంది’’..
- సర్జికల్ స్ట్రైక్స్పై మరో కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- దీనికి ముందు, ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఎంపీ చన్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Imran Masood: 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ మరోసారి పాకిస్తాన్పై విరుచుకుపడుతుందా?? గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందా.? అని యావత్ దేశం చూస్తోంది. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి సంఘర్షణ వచ్చే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్పై దౌత్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్కి కీలకమైన ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ నిలిపేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు టూరిస్టుల ‘‘మతాన్ని’’ అడగలేదంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుతం ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ గురించి అనుమానాలు ఉన్నాయని అన్నారు.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
Read Also: Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..
తాజాగా, మరో ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్తో భారత్ ప్రపంచం ముందు నవ్వులపాలైంది’’ అని అన్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 3000 మంది పౌరులు మరణించారు, ఆ సమయంలో ఉగ్రవాదులపై ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదని ఇంటర్వ్యూ నిర్వహించిన హోస్ట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉరి జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి; పుల్వామా జరిగినప్పుడు, బాలకోట్లో వైమానిక దాడులు జరిగాయి’’ అని ఆమె అన్నారు.
దీనికి మసూద్ స్పందిస్తూ.. ప్రపంచం మొత్తం వైమానిక దాడి గురించి నవ్వుకుందని, పాకిస్థానీలు మా మూడు కాకులను చంపారని చెబుతున్నారని అన్నారు. దీనికి ముందు, కాంగ్రెస్కి చెందిన ఎంపీ చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మే 2న న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత చన్నీ మాట్లాడుతూ.. “మన దేశంలో బాంబు పడితే, ఎవరికీ తెలియదు. మేము పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని వారు చెబుతున్నారు. ఏమీ జరగలేదు, సర్జికల్ స్ట్రైక్స్ కనిపించలేదు, వాటి గురించి ఎవరికీ తెలియదు.” అని అన్నారు.
🚨Congress MP Imran Masood says the whole world LAUGHED at India’s Surgical Strike.
~ First question the strike, then mock it?
How far will they stoop just to appease their vote bank?— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 6, 2025
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!