Khap Panchayat: స్వలింగ వివాహాలు, లివ్-ఇన్ రిలేషన్ నిషేధించాలి.. జంతువులు కూడా ఇలా చేయవు..
- స్వలింగ వివాహాలు..సహజీవనంపై ఖాప్ పంచాయతీ ఆందోళన..
- బ్యాన్ విధించాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక..
- జంతువులు కూడా ఇలా చేయవని ఖాప్ పంచాయతీ పెద్దల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khap Panchayat: హర్యానా జింద్లోకి ఖాప్ పంచాయతీ పెద్దలు ‘‘స్వలింగ వివాహాలు’’, ‘‘సహజీవనం’’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ విలువలు, సామాజిక నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలు, లిన్ ఇన్ రిలేషన్లపై నిషేధిం విధించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి 300 మంది పంచాయతీలకు చెందిన నేతలు ఈ సమాజిక సమస్యలపై తమ ఆందోళనల్ని లేవనెత్తారు. జూలై 28 ఆదివారం రోజున నిర్వహించిన ‘‘మహా పంచాయత్’’తో తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకుండా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Read Also: Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”
Also Read
- LPG New Rules: ఎల్పీజీ సిలిండర్ న్యూ రూల్స్.. 90 రోజుల గడువు ముగిసింది! ఈ ముఖ్యమైన పనిని ఈరోజే పూర్తి చేయండి
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
బెనైన్ ఖాప్ చీఫ్ రఘుబీర్ నైన్ లివ్-ఇన్ రిలేషన్షిప్స్ మరియు స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. జంతువులు కూడా ఇలాంటి వాటికి పాల్పడవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సమ్మతితో నిర్వహించే ప్రేమ వివాహాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతూనే, ఒకే గోత్రంలో వివాహాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మరో ఖాప్ నేత సంతోష్ దహియా మాట్లాడుతూ.. ఒకే గోత్రంలో వివాహాలు సామాజికంగా ప్రభావం చూపించడమే కాకుండా, జన్యుపరమైన సమస్యలకు దారి తీస్తాయని చెప్పారు. కాబట్టి ఒకే గోత్రంలో వివాహాలను నిషేధించాలని సూచించారు.
లివ్-ఇన్ రిలేషన్షిప్ భావనను మరియు భారతదేశంలో దాని చట్టబద్ధతను కూడా నాయకులు వ్యతిరేకించారు. “లివ్-ఇన్ సంబంధాలు కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. ఇవి సమాజం, పిల్లలు, మన సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని దహియా ఆందోళన వ్యక్తం చేశారు. లివ్ ఇన్ సంబంధాల వల్ల మహిళలు ప్రభావితమవుతున్నారని అన్నారు. ఖాప్ పంచాయితీ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి చట్ట సవరణలను కోరాలని అనుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని, ఇందుకోసం 51 మంది సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్కు గూస్బంప్స్!
-
Women’s T20 World Cup 2026: ‘మారిజాన్ కాప్’ దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
-
Khawaja Asif: ఆ విషయంలో భారత్పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
-
Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Tollywood : వందల కోట్ల రెమ్యునరేషన్స్తో హీరోలతో పోటీపడుతోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!