Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Man Wins ₹ 70 Lakh Lottery: కేరళలో ఓ చేపల వ్యాపారికి భారీ లాటరీ తగిలింది. అక్టోబర్ 12ను అతను తన జీవితాంతం మరిచిపోలేడు. ఏకంగా రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. అప్పుల బాధతో ఉన్న అతనిని లక్ష్మీ దేవి కరుణించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అతను తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందిన కొన్ని గంటల్లోనే అతను ఈ లాటరీని గెలుచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన నలబై ఏళ్ల పూకుంజు అదృష్టం కొద్దీ రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. దీనికి ముందు పూకుంజు ఓ బ్యాంకు నుంచి రూ. 12 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అయితే అది చెల్లించకపోవడంతో అక్టోబర్ 12న సదరు బ్యాంకు అటాచ్మెంట్ నోటీసులు అందించింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల తరువాత అదే రోజు అక్షయ లాటరీలో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో పూకుంజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన రుణబాధలు అన్ని తీరుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
Read Also: Boora Narsaiah Goud Quit TRS: టీఆర్ఎస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్..?
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకు నోటీసులు అందుకుంటే అదే రోజు 3 గంటలకు లాటరీని గెలుచుకున్నాడు పూకుంజు. ఉత్తర మైనాగపల్లి ప్రాంతానికి చెందిన పూకుంజు స్కూటర్ పై చేపలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను తన ఇంటిని నిర్మించుకునేందుకు కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకున్నాడు. దీనిని కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. నోటీసులు అందిన తర్వాత మేం నిరాశ చెందామని.. మా ఆస్తిని విక్రయించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డట్లు, పూకుంజు భార్య వెల్లడించారు. బ్యాంక్ లోన్ తో పాటు లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 5 లక్షలు అప్పుచేసినట్లు పూకుంజు పిల్లలు తెలిపారు. లాటరీని గెలవడంపై ఆనందం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. ఈ లాటరీ డబ్బులతో అప్పులన్నీ తీర్చి వేసి, పిల్లలకు మంచి చదువు అందిస్తామని పూకుంజు భార్య తెలిపారు.
తాజావార్తలు
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!