Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Man Wins ₹ 70 Lakh Lottery: కేరళలో ఓ చేపల వ్యాపారికి భారీ లాటరీ తగిలింది. అక్టోబర్ 12ను అతను తన జీవితాంతం మరిచిపోలేడు. ఏకంగా రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. అప్పుల బాధతో ఉన్న అతనిని లక్ష్మీ దేవి కరుణించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అతను తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందిన కొన్ని గంటల్లోనే అతను ఈ లాటరీని గెలుచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన నలబై ఏళ్ల పూకుంజు అదృష్టం కొద్దీ రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. దీనికి ముందు పూకుంజు ఓ బ్యాంకు నుంచి రూ. 12 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అయితే అది చెల్లించకపోవడంతో అక్టోబర్ 12న సదరు బ్యాంకు అటాచ్మెంట్ నోటీసులు అందించింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల తరువాత అదే రోజు అక్షయ లాటరీలో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో పూకుంజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన రుణబాధలు అన్ని తీరుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Boora Narsaiah Goud Quit TRS: టీఆర్ఎస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్..?
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకు నోటీసులు అందుకుంటే అదే రోజు 3 గంటలకు లాటరీని గెలుచుకున్నాడు పూకుంజు. ఉత్తర మైనాగపల్లి ప్రాంతానికి చెందిన పూకుంజు స్కూటర్ పై చేపలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను తన ఇంటిని నిర్మించుకునేందుకు కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకున్నాడు. దీనిని కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. నోటీసులు అందిన తర్వాత మేం నిరాశ చెందామని.. మా ఆస్తిని విక్రయించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డట్లు, పూకుంజు భార్య వెల్లడించారు. బ్యాంక్ లోన్ తో పాటు లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 5 లక్షలు అప్పుచేసినట్లు పూకుంజు పిల్లలు తెలిపారు. లాటరీని గెలవడంపై ఆనందం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. ఈ లాటరీ డబ్బులతో అప్పులన్నీ తీర్చి వేసి, పిల్లలకు మంచి చదువు అందిస్తామని పూకుంజు భార్య తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!