Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..

  • కేరళలో ముదిరిన వర్గపోరు..
  • సీఎం అభ్యర్థిపై ఎటూ తేల్చని కాంగ్రెస్..
  • రాహుల్, ప్రియాంకా గాంధీలకు కార్యకర్తల వార్నింగ్..
Congress

Congress

Kerala CM Row: కేరళ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా, కాంగ్రెస్ పార్టీకి సుఖం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ఎంపిక అంశం ఆ పార్టీలో వర్గపోరుకు కారణమైంది. కేసీ వేణు గోపాల్, రమేష్ చెన్నితాల, వీడీ సతీషన్ మధ్య సీఎం పోరు తీవ్రమైంది. అధిష్టానం కేసీ వేణుగోపాల్ వైపు చూస్తున్నప్పటికీ, స్థానికంగా మాత్రం సతీషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

Read Also: Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!

ఇదిలా ఉంటే, కేరళలో వర్గపోరు ఏ స్థాయికి చేరిందంటే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వయనాడ్ జిల్లా కంగ్రెస్ కమిటీ కార్యాలయం ముందు ‘‘రాహుల్ గారు, ప్రియాంక గారు, వయనాడ్‌ను మర్చిపోండి. మీరు ఇక్కడ నుండి మళ్లీ గెలవలేరు’’ అని రాసి ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘‘రాహుల్ గారూ కేసీ మీ సంచి మోసేవారు కావచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించారు’’ అని రాసి ఉన్నాయి. ఇదే కాకుండా ఇది కేవలం హెచ్చరి కాదని, కేరళ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదని వార్నింగ్ ఇచ్చారు.

ఇదే కాకుండా, అమేథీలో రాహుల్ గాంధీ ఓటమిని గుర్తు చేస్తూ.. వయనాడ్ ‘‘తదుపరి అమేథీ’’గా మారొచ్చని మరో పోస్టర్‌లో హెచ్చరించారు. రాహుల్, ప్రియాంకాలా మూర్ఖపు నిర్ణయాలను కేరళ అంగీకరించదని ఇంకో పోస్టల్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రిని ఎంపిక చేయలేక సతమతమవుతున్న కాంగ్రెస్ పరిస్థితిపై బీజేపీ, ఎల్డీఎఫ్‌లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.