IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
- కొత్త తరహా మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు
- ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం
- 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Tickets Scam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కొనసాగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఫ్రీ ఐపీఎల్ టికెట్లు, ఉచిత లైవ్ స్ట్రీమింగ్ పేరుతో అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ వెల్లడించింది. ఈ మోసాల్లో భాగంగా ఇప్పటికే 600కు పైగా ఫేక్ టికెట్ వెబ్సైట్లు, 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు గుర్తించినట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఈ ఫేక్ వెబ్సైట్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం అంటూ.. వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నాయి. మరోవైపు ‘ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్’ పేరుతో ప్రజలను ఆకర్షించి.. వారి ఫోన్లు, ల్యాప్టాప్లలో ప్రమాదకరమైన మాల్వేర్ను సైబర్ నేరగాళ్లు ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెబ్సైట్లు చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మ్యాచ్ షెడ్యూల్స్, టీమ్ లోగోలు, ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్, కస్టమర్ రివ్యూలు వంటి ఫీచర్లు ఉండటంతో.. ఫేక్ వెబ్సైట్లు అసలైన సైట్లలా కనిపిస్తున్నాయి.
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ ఫేక్ లింకులు సోషల్ మీడియా పోస్టులు, టెలిగ్రామ్ ఛానెల్స్, ఫోరమ్స్, యాడ్స్ ద్వారా విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కొన్నిసార్లు యూజర్ ఏ డివైస్ వాడుతున్నాడో గుర్తించి దానికి అనుగుణంగా వేరువేరు హానికర పేజీలకు రీడైరెక్ట్ చేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకంగా ‘SHub Stealer’ అనే ప్రమాదకర మాల్వేర్ను ఈ నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఇన్స్టాల్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాల్వేర్ ఒకసారి డివైస్లో ఇన్స్టాల్ అయితే.. యూజర్ల పాస్వర్డ్స్, బ్రౌజర్ డేటా, మెసేజింగ్ యాప్ సెషన్స్, క్రిప్టో వాలెట్.. వంటి సమాచారంను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. అంతేకాదు డివైస్లో ఉన్న ఫైల్స్ను కూడా హ్యాకర్లు సులభంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేయాలంటే అధికారిక టికెటింగ్ ప్లాట్ఫామ్స్ను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ అంటూ వచ్చే అనుమానాస్పద వెబ్సైట్లను పూర్తిగా దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. తెలియని ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియా లేదా వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించారు. ఐపీఎల్ క్రేజ్ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అభిమానులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!