Kerala Floods: అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి
- అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి
- విలయంపై వారం ముందే హెచ్చరించినట్లు అమిత్ షా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ విలయంపై వారం రోజుల క్రితమే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు. విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్కు ఎలాంటి రెడ్ అలర్ట్ ప్రకటించలేదని తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: World Breastfeeding Week: ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్కు రెడ్ అలర్ట్ ప్రకటించలేదని పినరాయి అన్నారు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయినా ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కూడా కాదని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారి సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కేంద్రానికి సీఎం హితవు పలికారు.
ఇది కూడా చదవండి: World Breastfeeding Week: ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ప్రకృతి విపత్తు గురించి జులై 23నే తెలియజేసి రాష్ట్రాన్ని అప్రమత్తం చేశామని.. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదన్నారు. ఆయన చేసిన ప్రకటనపై తాజాగా సీఎం స్పందిస్తూ కొట్టిపారేశారు.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీశారని.. 191 మంది ఆచూకీ గుర్తించలేదని తెలిపారు. 5,500 మందిని రక్షించినట్లు వెల్లడించారు. 8 వేల మందికి పైగా బాధితులను 82 శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Crime: ఫేస్బుక్లో పరిచయం.. హైదరాబాద్కు పిలిచి అత్యాచారం..! ఘటన వెనుక విస్తుపోయే వాస్తవాలు..
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!