Kerala Floods: అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి
- అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి
- విలయంపై వారం ముందే హెచ్చరించినట్లు అమిత్ షా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ విలయంపై వారం రోజుల క్రితమే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు. విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్కు ఎలాంటి రెడ్ అలర్ట్ ప్రకటించలేదని తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: World Breastfeeding Week: ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
Also Read
విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్కు రెడ్ అలర్ట్ ప్రకటించలేదని పినరాయి అన్నారు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయినా ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కూడా కాదని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారి సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కేంద్రానికి సీఎం హితవు పలికారు.
ఇది కూడా చదవండి: World Breastfeeding Week: ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ప్రకృతి విపత్తు గురించి జులై 23నే తెలియజేసి రాష్ట్రాన్ని అప్రమత్తం చేశామని.. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదన్నారు. ఆయన చేసిన ప్రకటనపై తాజాగా సీఎం స్పందిస్తూ కొట్టిపారేశారు.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీశారని.. 191 మంది ఆచూకీ గుర్తించలేదని తెలిపారు. 5,500 మందిని రక్షించినట్లు వెల్లడించారు. 8 వేల మందికి పైగా బాధితులను 82 శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Crime: ఫేస్బుక్లో పరిచయం.. హైదరాబాద్కు పిలిచి అత్యాచారం..! ఘటన వెనుక విస్తుపోయే వాస్తవాలు..
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!