Kerala: అమీబా విధ్వంసం.. ఇప్పటి వరకు 19మంది..
- మెదడును తినే అమీబా వ్యాధి
- ఇప్పటివరకు 61 కేసులు నమోదు
- రాష్ట్రంలో హై అలర్ట్ జారీ..
- అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదడును తినే అమీబా వ్యాధి, మెదడు దెబ్బతినేలా చేస్తుంది, కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల కలిగే ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. . ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేయబడింది . అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మరణాలలో ఏడు మరణాలు గత నెలలోనే సంభవించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది తీవ్రమైన మెదడు ఇన్ఫెక్షన్, రోగికి సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది, ఇది తీవ్రమైన వాపు, మెదడుకు నష్టం కలిగిస్తుంది.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
అమీబా అనేది మానవ మెదడుపై దాడి చేసే ఒక చిన్న జీవి. ఇది అనేక జాతులలో ఉంటుంది . నదులు, చెరువులు, మంచినీటి సరస్సులు, నీటి కుంటలు, నీటి గుంటలలో కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ మెదడు జ్వరానికి కారణమవుతుంది, దీనిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ మెదడు వాపుకు కారణమవుతుంది. రోగి మూర్ఛలు, తరచుగా మూర్ఛపోవడం ..కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది.. పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు. అందుకే దీనిని మెదడును తినే అమీబా అని పిలుస్తారు. దీని ప్రారంభ లక్షణాలలో మెడ గట్టిపడటం, తలనొప్పి, వికారం ,వాంతులు ఉంటాయి.
ఈ వ్యాధి వ్యాప్తి కేరళలో భయాందోళనలను సృష్టించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ తమ నిఘాను పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు అప్పుడప్పుడు నమోదవుతున్నాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. బాధితుల్లో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వృద్ధుడు వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసి, ప్రతి అనుమానిత కేసులను పరీక్షించాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!