JP Nadda: కేరళ ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారింది.. మత ఘర్షణలు పెరిగాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
కేరళ కొట్టాయంలో బీజేపీ పార్టీ కార్యక్రమానికి హాజరైన జేపీ నడ్డా ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడ్దారు. చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని హర్యానాలో విపక్ష పార్టీ ర్యాలీని పస్తావించి విమర్శలు చేశారు. అవన్నీ కుటుంబ పార్టీలే అని.. అవినీతి ఆరోపణల్లో ఉన్న పార్టీలే అని జేపీ నడ్డా విమర్శించారు. వంశపారంపర్య పార్టీలు, అవినీవి పార్టీల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ పోరాడుతోందని ఆయన అన్నారు. కేరళలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని.. హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు.
Also Read
- Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్కు శిక్ష..
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
Read Also: Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై నిషేధం.. ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్
బూల్ స్తాయి వరకు బీజేపీ పార్టీని తీసుకెళ్లాలని.. బీజేపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేరళలో ఎలాంటి పాలన సాగిస్తున్నారో తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో బీజేపీ జిల్లా కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేరళ విశ్వవిద్యాలయాల్లో బంధుప్రీతి ఆధారంగా నియామకాలు జరుగుతన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న వారి బంధువులే యూనివర్సిటీల్లో నియమితులవుతున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం లోకాయుక్త అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!