PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..
- భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి..
- ‘‘హిందీ’’ వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- హిందీపై కేంద్రం వర్సెస్ తమిళనాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
భారతీయ భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానికొకటి సుసంపన్నం చేసిందని, భాషాశాస్త్రం ఆధారంగా వివక్ష చూపే ప్రయత్నాలకు తగిన సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠీ ధైర్యం, సున్నితత్వ, సమానత్వం, అందాన్ని ప్రతిబింబించే పూర్తి భాష అని ప్రశంసించారు. భాషల ఆధారంగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు, భారతదేశ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. ‘‘దురభిప్రాయాల నుంచి మనల్ని మనం దూరం చేసుకుని, అన్ని భాషల్ని స్వీకరించి, సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’’ అని ప్రధాని అన్నారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరించి, కొత్త మార్పులను స్వాగతించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటి అని మోదీ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద భాషా వైవిధ్యం కలిగి ఉందనే మాట వాస్తవం దీనికి నిదర్శనమని, భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారం అని మోడీ అన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా వచ్చిన తర్వాత దేశ రాజధానిలో మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం 350వ సంవత్సరం, ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..