PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..
- భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి..
- ‘‘హిందీ’’ వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- హిందీపై కేంద్రం వర్సెస్ తమిళనాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
భారతీయ భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానికొకటి సుసంపన్నం చేసిందని, భాషాశాస్త్రం ఆధారంగా వివక్ష చూపే ప్రయత్నాలకు తగిన సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠీ ధైర్యం, సున్నితత్వ, సమానత్వం, అందాన్ని ప్రతిబింబించే పూర్తి భాష అని ప్రశంసించారు. భాషల ఆధారంగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు, భారతదేశ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. ‘‘దురభిప్రాయాల నుంచి మనల్ని మనం దూరం చేసుకుని, అన్ని భాషల్ని స్వీకరించి, సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’’ అని ప్రధాని అన్నారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరించి, కొత్త మార్పులను స్వాగతించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటి అని మోదీ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద భాషా వైవిధ్యం కలిగి ఉందనే మాట వాస్తవం దీనికి నిదర్శనమని, భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారం అని మోడీ అన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా వచ్చిన తర్వాత దేశ రాజధానిలో మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం 350వ సంవత్సరం, ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!