PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..
- భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి..
- ‘‘హిందీ’’ వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- హిందీపై కేంద్రం వర్సెస్ తమిళనాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
భారతీయ భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానికొకటి సుసంపన్నం చేసిందని, భాషాశాస్త్రం ఆధారంగా వివక్ష చూపే ప్రయత్నాలకు తగిన సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠీ ధైర్యం, సున్నితత్వ, సమానత్వం, అందాన్ని ప్రతిబింబించే పూర్తి భాష అని ప్రశంసించారు. భాషల ఆధారంగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు, భారతదేశ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. ‘‘దురభిప్రాయాల నుంచి మనల్ని మనం దూరం చేసుకుని, అన్ని భాషల్ని స్వీకరించి, సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’’ అని ప్రధాని అన్నారు.
Also Read
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
Read Also: Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరించి, కొత్త మార్పులను స్వాగతించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటి అని మోదీ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద భాషా వైవిధ్యం కలిగి ఉందనే మాట వాస్తవం దీనికి నిదర్శనమని, భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారం అని మోడీ అన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా వచ్చిన తర్వాత దేశ రాజధానిలో మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం 350వ సంవత్సరం, ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!