PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..
- భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి..
- ‘‘హిందీ’’ వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- హిందీపై కేంద్రం వర్సెస్ తమిళనాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
భారతీయ భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానికొకటి సుసంపన్నం చేసిందని, భాషాశాస్త్రం ఆధారంగా వివక్ష చూపే ప్రయత్నాలకు తగిన సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠీ ధైర్యం, సున్నితత్వ, సమానత్వం, అందాన్ని ప్రతిబింబించే పూర్తి భాష అని ప్రశంసించారు. భాషల ఆధారంగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు, భారతదేశ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు. ‘‘దురభిప్రాయాల నుంచి మనల్ని మనం దూరం చేసుకుని, అన్ని భాషల్ని స్వీకరించి, సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’’ అని ప్రధాని అన్నారు.
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Also: Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరించి, కొత్త మార్పులను స్వాగతించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటి అని మోదీ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద భాషా వైవిధ్యం కలిగి ఉందనే మాట వాస్తవం దీనికి నిదర్శనమని, భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారం అని మోడీ అన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా వచ్చిన తర్వాత దేశ రాజధానిలో మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం 350వ సంవత్సరం, ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!