Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. దీంతో, భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ పవిత్రోత్సవాన్ని తిలకించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also: Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, అంతకుముందు, మే 3న, అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి మరియు యమునోత్రి యొక్క పోర్టల్స్ తెరవబడ్డాయి, ఇది చార్ ధామ్ యాత్ర 2022 ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది… భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి కొన్ని గంటల ముందు, సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ట్విట్టర్ పోస్ట్ ద్వారా, భక్తులకు స్వాగతం పలికారు.. తన ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. కాగా, 6 నెలల తర్వాత కేదారేశ్వరుని ఆలయాన్ని ఓపెన్ చేశారు.. ఈ ఆలయం ఏడాదిలో చాలాకాలం పాటూ మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో క్షేత్రాన్ని ప్రతీ ఏడాది మూసివేస్తారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సాధారణం కావడంతో ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.
అయితే, కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా చార్ ధామ్ యాత్ర 2022 కోసం యాత్రికుల సంఖ్యపై ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించిన విషయాన్ని యాత్రికులు గమనించాలి. అధికారులు కేదార్నాథ్ ఆలయానికి రోజువారీ పరిమితిని 12,000, బద్రీనాథ్కు 15,000గా నిర్ణయించారు.. మరోవైపు, చార్ ధామ్ యాత్రకు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా కోవిడ్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి కాదని తెలిపింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!