Kcr Front Venue: బీజేపీ వ్యతిరేక శక్తుల వేదిక ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు మొదలైంది.ఇప్పటికే టీఆర్ఎస్,టీఎంసీ,డీఎంకే,ఎన్సీపీ, శివసేన ,ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలసి ముందుకు నడిచే దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా త్వరలో ప్రాంతీయ పార్టీలు,బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తుల సమావేశంను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు జరుగుతుంది .
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా ఫలితాలు ఉండకపోవచ్చు అని ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్కలుగా ఉన్నాయి.అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత …ప్రాంతీయ పార్టీల సమావేశం ఉండే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు రాకపోతే…ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం ఉంది.
మరోవైపు మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారంకు మమత బెనర్జీ సిద్ధం అయ్యారు. ఆ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రాంతీయ పార్టీలు ఆ వేదికను కలసి పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీల సమావేశం హైదరాబాద్ లో ఉంటుందా లేక మరొక చోట ఉంటుందా అన్నది మార్చిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉథ్దవ్ థాకరే లాంటివారు బీజేపీయేతర ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. వీరంతా కలిసి ఒక వేదిక ఏర్పాటుచేస్తే వీరితో భావసారూప్యం వున్న పార్టీలు కలిసి వస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..