MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
- కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
- ఇవాళ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ… అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. రూ. 100 కోట్ల విరాళాలు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సీబీఐ చెబుతోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం.
Read also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
కవిత సహకారంతో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారంలో చిల్లర జోన్లు సంపాదించారని, ఇందుకోసం కవితకు డబ్బులు ఇచ్చారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను దర్యాప్తు సంస్థ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. జూలై 1న ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగించిన జస్టిస్ కావేరీ బవేజా గురువారం సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు పొడిగించారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు
తాజావార్తలు
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..